North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- నార్త్ సైప్రస్ తీరంలో ఘోర ప్రమాదం
- సముద్రంలో ఫెర్రీ బోల్తా
- 270 మంది ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్త్ సైప్రస్ తీరంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 270 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీ సముద్రంలో బోల్తాపడింది. ఫెర్రీలోకి నీరు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు టర్కిష్ సైప్రియట్, టర్కీ మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక, గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
నీరు చేరడంతో బోల్తా..
కాటమరాన్ తరహా ఈ ఫెర్రీ నార్త్ సైప్రస్లోని కైరేనియా (గిర్నే) పోర్టు నుంచి టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్లో ఉన్న తసూకు పోర్టుకు బయలుదేరింది. మార్గమధ్యంలో నార్త్ సైప్రస్ తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఫెర్రీలోకి ఒక్కసారిగా నీరు చేరడం ప్రారంభమైంది. దీంతో కొద్దిసేపటికే నౌక అదుపుతప్పి సముద్రంలో బోల్తాపడినట్లు టర్కీ ప్రభుత్వ ప్రసార సంస్థ తెలిపింది. నార్త్ సైప్రస్ రవాణా మంత్రి ఎర్హాన్ అరిక్లీ కూడా ఫెర్రీ బోల్తాపడినట్లు ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదం నేపథ్యంలో అధికారులు వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫెర్రీలో ఉన్న ప్రయాణికులను గుర్తించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎంతమందిని రక్షించారు? ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అలాగే ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏమిటన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
కైరేనియా నుంచి టర్కీలోని తసూకు వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫెర్రీలోకి నీరు చేరడానికి గల కారణాలు, ప్రమాద సమయంలో ప్రయాణికుల పరిస్థితి, ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలపై మరిన్ని వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజా సమాచారం కోసం అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!