Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manisha Koirala: నేపాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వస్థలం నేపాల్ అయిన ఆమె, అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయి, తన సోషల్ మీడియా వేదికల ద్వారా బాధను పంచుకున్నారు. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవ్వడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై ఆమె స్పందిస్తూ.. నా మాతృభూమి పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె పగిలిపోతోందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వెంటనే స్పందించి నేపాల్ ప్రజలకు, వరద బాధితులకు అవసరమైన ఆహారం, వైద్యం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాదు చైనా, భారత్ నేపాల్ కు అండగా ఉండాలని, తాను కూడా వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో భాగస్వామిని అవుతున్నట్లు భావోద్వేగంగా తెలిపారు.
నేపాల్లో ప్రకృతి పెను విషాదం సృష్టించింది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు తన దేశంపై చూపిస్తున్న ప్రభావాన్ని చూసి భావోద్వేగానికి గురైన మనీషా కొయిరాలా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. నేపాల్కు భారత్, చైనాలు అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఈ విపత్తు కారణంగా నేపాల్ను పర్యాటకులకు దూరం చేయవద్దని, దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఎంతో కీలకమని ఆమె గుర్తుచేశారు. ఆగస్టు 26న నేపాల్ భారీ వరదలు సంభవించాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా రసువా, నువాకోట్, ధాదింగ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విపత్తు తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
Also Read
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ఆగస్టు 30 నాటికి నేపాల్లో ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 781కు చేరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మరో 2,500 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న టిబెట్ ప్రాంతంలోనూ 16 మంది మరణించగా, వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ విపత్తులో పర్యాటకులు, తీర్థయాత్రికులు, విదేశీయులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. దీంతో నేపాల్తో పాటు అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాఠ్మాండులో సద్గురు ఆధ్వర్యంలోని ఇషా ఫౌండేషన్ నిర్వహించిన ‘ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్’ కార్యక్రమంలో మనీషా కొయిరాలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నేపాల్ పరిస్థితిపై మాట్లాడుతుండగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పదేపదే ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల నేపాల్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను ఆమె ప్రస్తావించారు. తన దేశం ఇలాంటి విషాదాల నుంచి ఎప్పుడు బయటపడుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక వరదల అనంతరం నేపాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ సహా పలు దేశాలు సహాయక సామగ్రి, రెస్క్యూ సిబ్బంది, ఇతర సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక బృందాలకు సవాలుగా మారాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేపాల్లో పుట్టి పెరిగిన మనీషా కొయిరాలాకు ఆ దేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఈ విపత్తుపై ఆమె స్పందన మరింత భావోద్వేగాన్ని కలిగించింది.
- Tags
- cinema
- Manisha Koirala
తాజావార్తలు
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!