Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్తో తొలిసారిగా వాణిజ్యం..
- అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్..
- 1971 తర్వాత పాకిస్తాన్తో నేరుగా వాణిజ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: 1971లో విడిపోయిన తర్వాత తొలిసారి బంగ్లాదేశ్, పాకిస్తాన్ తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పున:ప్రారంభించాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత మొదటి కార్గో పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల పాకిస్తానీ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్కి చెందిన నౌక బంగ్లాదేశ్ ఓడరేవుకు వెళ్తున్నట్లు మీడియా వెల్లడించింది. రెండు దశల్లో 25,000 టన్నుల చొప్పున ఈ బియ్యాన్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్కి పంపించనుంది.
Read Also: Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం.. ఆ దేశానికి ఎందుకు సాయం చేయాలంటూ ట్రంప్ ఫైర్..
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, మహ్మద్ యూనస్ ఆ దేశ ప్రభుత్వానికి తాత్కాలిక అధిపతి అయ్యారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయి. చివరకు బంగ్లా సైన్యానికి పాకిస్తాన్ శిక్షణ ఇచ్చేంత వరకు ఈ స్నేహ సంబంధాలు వచ్చాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు కూడా బంగ్లాదేశ్లో పర్యటించడం భారత్కి ఆందోళన కలిగించే విషయం. బంగ్లా సైనిక అధికారులు పాకిస్తాన్ వెళ్లి అక్కడి సైన్యంతో భేటీ అయ్యారు.
1970లలో పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశీయులపై చేసిన దురాగతాలను, అత్యాచారాలను మరించిపోయి, ఇప్పుడు పాకిస్తాన్ స్నేహం కోసం ఆ దేశం చాలా ఆసక్తి చూపిస్తోంది. అనేక మంది బెంగాలీలను ఊచకోత కోసింది. లక్షల్లో మరణాలు సంభవించాయి. ఈ అవమానాలు అన్నింటిని బంగ్లాదేశ్ ప్రస్తుతం మరిచిపోయినట్లుంది. ఇక బంగ్లాదేశ్లో మతఛాందసవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థల ఉన్మాదం క్రమంగా పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో మరో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ మారే పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..