Ukraine Russia Tensions: ఉక్రెయిన్లో 20 వేల మంది భారతీయులు..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్ నగరాన్ని ఇప్పటికే రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా..
Read Also: Ukraine Crisis: పుతిన్తో ప్రధాని మోడీ చర్చలు..
Also Read
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
ఒక నెల క్రితం ఉక్రెయిన్లో భారతీయ పౌరుల నమోదు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు వర్ష వర్ధన్ ష్రింగ్లా… “ఆన్లైన్ రిజిస్ట్రేషన్” ఆధారంగా సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నట్లు తెలుసుకున్నామన్న ఆయన.. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని తెలిపారు.. ఇక, విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్కు 980 ఫోన్లు, 850 ఈ-మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు.. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, హంగేరీ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడతారు అని తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్లోని విద్యార్థులతో సహా, భారత పౌరుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రధాని మోడీ “భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ” సమావేశంలో పేర్కొన్నారు.. ఇక, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన భారత ప్రధాని..ఉక్రెయిన్కు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకున్నారు.. నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా చేస్తున్న హింసను తక్షణమే విరమించుకోవాలని పుతిన్కి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
-
Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!