Ukraine Russia Tensions: ఉక్రెయిన్లో 20 వేల మంది భారతీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్ నగరాన్ని ఇప్పటికే రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా..
Read Also: Ukraine Crisis: పుతిన్తో ప్రధాని మోడీ చర్చలు..
Also Read
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
ఒక నెల క్రితం ఉక్రెయిన్లో భారతీయ పౌరుల నమోదు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు వర్ష వర్ధన్ ష్రింగ్లా… “ఆన్లైన్ రిజిస్ట్రేషన్” ఆధారంగా సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నట్లు తెలుసుకున్నామన్న ఆయన.. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని తెలిపారు.. ఇక, విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్కు 980 ఫోన్లు, 850 ఈ-మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు.. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, హంగేరీ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడతారు అని తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్లోని విద్యార్థులతో సహా, భారత పౌరుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రధాని మోడీ “భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ” సమావేశంలో పేర్కొన్నారు.. ఇక, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన భారత ప్రధాని..ఉక్రెయిన్కు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకున్నారు.. నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా చేస్తున్న హింసను తక్షణమే విరమించుకోవాలని పుతిన్కి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!