Ukraine Russia Tensions: ఉక్రెయిన్లో 20 వేల మంది భారతీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్ నగరాన్ని ఇప్పటికే రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా..
Read Also: Ukraine Crisis: పుతిన్తో ప్రధాని మోడీ చర్చలు..
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఒక నెల క్రితం ఉక్రెయిన్లో భారతీయ పౌరుల నమోదు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు వర్ష వర్ధన్ ష్రింగ్లా… “ఆన్లైన్ రిజిస్ట్రేషన్” ఆధారంగా సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నట్లు తెలుసుకున్నామన్న ఆయన.. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని తెలిపారు.. ఇక, విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్కు 980 ఫోన్లు, 850 ఈ-మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు.. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, హంగేరీ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడతారు అని తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్లోని విద్యార్థులతో సహా, భారత పౌరుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రధాని మోడీ “భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ” సమావేశంలో పేర్కొన్నారు.. ఇక, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన భారత ప్రధాని..ఉక్రెయిన్కు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకున్నారు.. నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా చేస్తున్న హింసను తక్షణమే విరమించుకోవాలని పుతిన్కి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!