Ukraine Russia Tensions: ఉక్రెయిన్లో 20 వేల మంది భారతీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్ నగరాన్ని ఇప్పటికే రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా..
Read Also: Ukraine Crisis: పుతిన్తో ప్రధాని మోడీ చర్చలు..
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ఒక నెల క్రితం ఉక్రెయిన్లో భారతీయ పౌరుల నమోదు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు వర్ష వర్ధన్ ష్రింగ్లా… “ఆన్లైన్ రిజిస్ట్రేషన్” ఆధారంగా సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నట్లు తెలుసుకున్నామన్న ఆయన.. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని తెలిపారు.. ఇక, విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్కు 980 ఫోన్లు, 850 ఈ-మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు.. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, హంగేరీ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడతారు అని తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్లోని విద్యార్థులతో సహా, భారత పౌరుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రధాని మోడీ “భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ” సమావేశంలో పేర్కొన్నారు.. ఇక, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన భారత ప్రధాని..ఉక్రెయిన్కు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకున్నారు.. నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా చేస్తున్న హింసను తక్షణమే విరమించుకోవాలని పుతిన్కి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!