Anti-Hijab Protest In Iran: అధికారులు కొట్టడంతోనే నా కూతురు చనిపోయింది: మహ్సా అమిని తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Hijab Protest In Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ దేశాన్ని కుదిపేస్తుంది. హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయింది. ఈ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి, ఇరాన్ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ను విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహ్సా అమిని తండ్రి అమ్జాద్ అమినీ కీలక విషయాలను వెల్లడించారు. తన కూతురిని మోరాలిటీ పోలీసులు కొట్టారని ఆరోపించారు. మహ్సా అమినిని అరెస్ట్ చేసినప్పుడు ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని.. ఆమెకు గుండెకు సంబంధించి వ్యాధి ఉందని అక్కడి అధికారులు చెప్పారు. దీన్ని మహ్సా అమిని తండ్రి పూర్తిగా ఖండించారు. అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కనీసం తన కుమార్తె శవ పరీక్ష నివేదికను కూడా చూసేందుకు అధికారులు అనుమతించలేదని అమ్జాద్ అమినీ వెల్లడించారు.
Also Read
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Read Also: Bus Accident in Nepal: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
అరెస్ట్ సమయంలో నా కొడుకు, నా కుమార్తెతో ఉన్నారని.. కొంతమంది సాక్షులు మహ్సా అమిని అరెస్ట్ చేసిన తర్వాత వ్యాన్ లో, పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొట్టారని చెప్పారని ఆయన బీబీసీ పర్షియన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. మహ్సా అమినిని తీసుకెళ్లద్దని నా కుమారుడు ప్రాధేయపడిని పోలీసులు కనికరించలేదని.. నా కుమారుడిని కూడా కొట్టారని.. బట్టలు చింపేశారని అమ్జాబ్ అమిని చెప్పారు. నా కుమర్తెను చూపించమని అడిగితే.. పోలీసులు బాడీ కెమెరాలు, కెమెరాల బ్యాటరీలు అయిపోయాయని చెప్పారని ఆయన తెలిపారు. నా కుమార్తెకు జలుబు తప్ప ఏ విధమైన అనారోగ్యం లేదని మహ్సా అమిని తండ్రి అమ్జాబ్ అమినీ వెల్లడించారు.
హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తోంది. ఇప్పటికే అక్కడి భద్రతాబలగాల దాడుల్లో 30 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!