Anti-Hijab Protest In Iran: అధికారులు కొట్టడంతోనే నా కూతురు చనిపోయింది: మహ్సా అమిని తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Hijab Protest In Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ దేశాన్ని కుదిపేస్తుంది. హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయింది. ఈ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి, ఇరాన్ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ను విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహ్సా అమిని తండ్రి అమ్జాద్ అమినీ కీలక విషయాలను వెల్లడించారు. తన కూతురిని మోరాలిటీ పోలీసులు కొట్టారని ఆరోపించారు. మహ్సా అమినిని అరెస్ట్ చేసినప్పుడు ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని.. ఆమెకు గుండెకు సంబంధించి వ్యాధి ఉందని అక్కడి అధికారులు చెప్పారు. దీన్ని మహ్సా అమిని తండ్రి పూర్తిగా ఖండించారు. అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కనీసం తన కుమార్తె శవ పరీక్ష నివేదికను కూడా చూసేందుకు అధికారులు అనుమతించలేదని అమ్జాద్ అమినీ వెల్లడించారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
Read Also: Bus Accident in Nepal: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
అరెస్ట్ సమయంలో నా కొడుకు, నా కుమార్తెతో ఉన్నారని.. కొంతమంది సాక్షులు మహ్సా అమిని అరెస్ట్ చేసిన తర్వాత వ్యాన్ లో, పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొట్టారని చెప్పారని ఆయన బీబీసీ పర్షియన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. మహ్సా అమినిని తీసుకెళ్లద్దని నా కుమారుడు ప్రాధేయపడిని పోలీసులు కనికరించలేదని.. నా కుమారుడిని కూడా కొట్టారని.. బట్టలు చింపేశారని అమ్జాబ్ అమిని చెప్పారు. నా కుమర్తెను చూపించమని అడిగితే.. పోలీసులు బాడీ కెమెరాలు, కెమెరాల బ్యాటరీలు అయిపోయాయని చెప్పారని ఆయన తెలిపారు. నా కుమార్తెకు జలుబు తప్ప ఏ విధమైన అనారోగ్యం లేదని మహ్సా అమిని తండ్రి అమ్జాబ్ అమినీ వెల్లడించారు.
హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తోంది. ఇప్పటికే అక్కడి భద్రతాబలగాల దాడుల్లో 30 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!