Anti-Hijab Protest In Iran: అధికారులు కొట్టడంతోనే నా కూతురు చనిపోయింది: మహ్సా అమిని తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Hijab Protest In Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ దేశాన్ని కుదిపేస్తుంది. హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయింది. ఈ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి, ఇరాన్ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ను విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహ్సా అమిని తండ్రి అమ్జాద్ అమినీ కీలక విషయాలను వెల్లడించారు. తన కూతురిని మోరాలిటీ పోలీసులు కొట్టారని ఆరోపించారు. మహ్సా అమినిని అరెస్ట్ చేసినప్పుడు ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని.. ఆమెకు గుండెకు సంబంధించి వ్యాధి ఉందని అక్కడి అధికారులు చెప్పారు. దీన్ని మహ్సా అమిని తండ్రి పూర్తిగా ఖండించారు. అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కనీసం తన కుమార్తె శవ పరీక్ష నివేదికను కూడా చూసేందుకు అధికారులు అనుమతించలేదని అమ్జాద్ అమినీ వెల్లడించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
Read Also: Bus Accident in Nepal: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
అరెస్ట్ సమయంలో నా కొడుకు, నా కుమార్తెతో ఉన్నారని.. కొంతమంది సాక్షులు మహ్సా అమిని అరెస్ట్ చేసిన తర్వాత వ్యాన్ లో, పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొట్టారని చెప్పారని ఆయన బీబీసీ పర్షియన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. మహ్సా అమినిని తీసుకెళ్లద్దని నా కుమారుడు ప్రాధేయపడిని పోలీసులు కనికరించలేదని.. నా కుమారుడిని కూడా కొట్టారని.. బట్టలు చింపేశారని అమ్జాబ్ అమిని చెప్పారు. నా కుమర్తెను చూపించమని అడిగితే.. పోలీసులు బాడీ కెమెరాలు, కెమెరాల బ్యాటరీలు అయిపోయాయని చెప్పారని ఆయన తెలిపారు. నా కుమార్తెకు జలుబు తప్ప ఏ విధమైన అనారోగ్యం లేదని మహ్సా అమిని తండ్రి అమ్జాబ్ అమినీ వెల్లడించారు.
హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తోంది. ఇప్పటికే అక్కడి భద్రతాబలగాల దాడుల్లో 30 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..