US Visa: భారత విద్యార్థులకు శుభవార్త.. రికార్డ్ స్థాయిలో వీసాల జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత సంవత్సరం కంటే ఈసారి రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ వీసాలని జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపింది. కరోనా సమస్యలు ఉన్నప్పటికీ.. గతేడాదిలో 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు అందాయి. ఈసారి లక్ష దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నామని పాట్రిసియా పేర్కొంది.
‘‘అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో విలువనిస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు’’ అని పాట్రిసియా చెప్పారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా భారత విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య 20 శాతానికిపైగానే ఉందని పాట్రిసియా చెప్పుకొచ్చారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె పై విధంగా మాట్లాడారు.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
ఇదిలావుండగా.. విద్యార్థులు ఏజెంట్ ద్వారా కాకుండా సొంతంగా స్లాట్లను బుక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే, స్లాట్ను ఏ ప్రదేశం నుంచి బుక్ చేశారో, ఆ ఐపీ అడ్రస్ను ట్రాక్ చేసి, రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వీసా ఇంటర్వ్యూకు అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచుకోవాలి.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!