అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత సంవత్సరం కంటే ఈసారి రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ వీసాలని జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపింది. కరోనా సమస్యలు ఉన్నప్పటికీ.. గతేడాదిలో 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు అందాయి. ఈసారి లక్ష దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నామని పాట్రిసియా పేర్కొంది. ‘‘అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో…