Sheikh Hasina: త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా.. అందుకే ఆ అల్లా నన్ను బతికించాడు..
- మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై షేక్ హసీనా ఆగ్రహం..
- బంగ్లాదేశ్ క్రమంగా ఉగ్రవాద దేశంగా మారిపోతోంది..
- త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా.. అందుకే ఆ అల్లా నన్ను బతికించాడు: షేక్ హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ దేశానికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో జరిగిన సంభాషణ సందర్భంగా ఈ విషయం తెలియజేసింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పై తీవ్ర విమర్శలు చేసింది. యూనస్కు ప్రజల మీద ప్రేమ లేదు.. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపి వచ్చారని పేర్కొనింది. ఆ సమయంలో ఆయన తీరును తాము అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పుకొచ్చింది. అతడికి దేశం ఎంతో సహాయం చేసిందన్నారు. ఇక, ఏదో ఒక కారణంతోనే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు.. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది.. నేను త్వరలోనే బంగ్లాదేశ్కు తిరిగి వస్తాను అని షేక్ హసీనా భరోసా ఇచ్చారు.
Read Also: IPL 2025: మంగళవారం రెండు ఐపీఎల్ మ్యాచ్లు.. ఇదే మొదటిసారి! కారణం ఏంటో తెలుసా?
Also Read
అయితే, మహమ్మద్ యూనస్ నిర్ణయాలతో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని షేక్ హసీనా తెలిపింది. అతడికి అధికారంపై వ్యామోహం మాత్రమే ఉంది.. వారి సారథ్యంలో బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా మారిపోతుందని ఆరోపించింది. మన నాయకులు, కార్యకర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు.. పోలీసులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కళాకారులు ఇలా ఎంతో మందిని టార్గెట్ గా చేసుకున్నారు.. ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు కొనసాగుతున్నాయి.. కానీ, ఇవి మీడియాలో రాకుండా చూస్తున్నారని హసీనా తెలిపింది.
Read Also: రాబోయే 50 ఏళ్లలో ఏ దేశం ఎన్ని సార్లు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడబోతుందంటే..?
అలాగే, తన కుటుంబం మొత్తం హత్యలకు గురైన సంఘటనలను షేక్ హసీనా గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు.. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరందరూ ఎంత బాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసు అని పేర్కొనింది. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు.. అందుకే నన్ను ఆ అల్లా ఇంకా రక్షిస్తున్నాడు.. నేను తిరిగి వచ్చిన తర్వాత అందరికి న్యాయం చేస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!