Lebanon-Israel War: తక్షణమే లెబనాన్ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- తక్షణమే లెబనాన్ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- భారత్తో పాటు పలు దేశాలు ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది. అంతేకాకుండా ఇటీవల ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత మరింత కఠినమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళిక రచించింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే భారతీయులు లెబనాన్ను ఖాళీ చేయాలని కేంద్రం సూచించింది. ఇక తప్పని పరిస్థితులు ఉంటే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. బీరూట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని కేంద్రం సూచించింది. లెబనాన్లోని భారతీయ పౌరుల కోసం ఎంబసీ ఎమర్జెన్సీ నంబర్ ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Delhi High Court: గర్భిణీగా ఉండటం అనారోగ్యం కాదు.. ఆమెకు ఉద్యోగాన్ని తిరస్కరించలేరు..
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సహా పలు దేశాలు తమ పౌరులను లెబనాన్ విడిచి వెళ్లాలని కోరాయి. తమ పౌరులకు లెబనాన్ నుంచి త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తూ సలహాలు జారీ చేశాయి.
ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్లో గత శనివారం హెజ్బొల్లా దాడితో ఫుట్బాల్ ఆడుతున్న 12 మంది చిన్నారులు, యువత మృతి చెందారు. దీంతో తీవ్ర ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేయవచ్చని అంతర్జాతీయ మీడియా వర్గాలు సైతం పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్ర్, ఆ సంస్థ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ కిపణులతో దాడిచేసింది. ఈ దాడిలో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మృతి చెందాడు. షుక్ర్ మృతిని హెజ్బొల్లా ధ్రువీకరించింది.
ఇది కూడా చదవండి: Kerala Floods: కేరళ వరదలు.. సూర్య అండ్ కో భారీ విరాళం
ఆ తర్వాత కొద్ది గంటలకే ఇరాన్లో ఉన్న హామస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హత్య చేసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అక్టోబర్ 7 మెరుపు దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హమాస్ సైనిక విభాగాధిపతి మహ్మద్ డెయిఫ్ను హత్య చేసినట్లు తాజాగా ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!