Bangladesh: మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.. బంగ్లాలో ఏం జరుగుతోంది.?
- బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు కీలక పరిణామం..
- జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. యావో వెన్తో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లియు యుయిన్, పొలిటికల్ డైరెక్టర్ జాంగ్జింగ్తో పాటు చైనీస్ అధికారులు ఉన్నారు. ఇరు దేశాల ప్రతనిధులు చైనా, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంశాల గురించి చర్చించారు.
చైనా, బంగ్లాదేశ్ మధ్య చారిత్రాత్మక స్నేహం ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి చాలా ముఖ్యమైందని జమాతే ఇస్లామీ పేర్కొంది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఈ సమావేశం జరగడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది. గత సంవత్సరం విద్యార్థి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించిన యువజన పార్టీ ఎన్సిపితో పొత్తు పెట్టుకుని జమాతే ఇస్లామీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇటీవల జగన్నాథ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
Read Also: India-China: “షక్స్గామ్ వ్యాలీ మాదే, భారత్ది కాదు”.. చైనా ప్రకటన..
గతేడాది షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం చైనా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లింది. ఇప్పుడు రెండోసారి జమాత్ నేతలతో చైనా అధికారులు భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లోని చైనా రాయబారి యావో వెన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గత దశాబ్ద కాలంలో బీఎన్పి, జమాతే ఇస్లామీతో చైనా సంబంధాలు కొనసాగించలేకపోయిందని, ఇప్పుడు వారితో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మతోన్మాద జమాతే ఇస్లామీకి, పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఈ పార్టీ నేతలు పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకోవాలని కోరుకున్నారు. భారత్ అంటే విషం వెళ్లగక్కే జమాతే ఇస్లామీ పార్టీ అధినేత ఇప్పుడు చైనా రాయబారితో భేటీ కావడం, భారత్కు ఆందోళన కలిగించే పరిణామాలు. షేక్ హసీనా సమయంలో భారత అనుకూల వైఖరి ఉండగా, ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను యూనస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక శక్తులైన పాక్, చైనాలకు ఆటస్థలంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!