Afghanistan: ఆఫ్ఘానిస్తాన్ మసీదులో పేలుడు.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఇమామ్ జమాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం షియా ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.
Read Also: Anil Ravipudi: మహేష్ తో సినిమా.. అసలు నిజం చెప్పిన అనిల్ రావిపూడి
Also Read
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
తాలిబాన్లు ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి అక్కడ జరిగిన ఉగ్రదాడులన్నింటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బాధ్యత వహిస్తోంది. గతంలో అనేక మసీదుల్లో ఇలానే ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చుకుని మరణించారు. ఈ సంఘటనల్లో ఐఎస్ ఉగ్రసంస్థ హస్తం ఉంది. ముఖ్యం షియాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.
తాలిబాన్ పాలన తిరిగి వచ్చిన తర్వాత ఐఎస్ రెచ్చిపోతోంది. కాబూల్ లోని దౌత్యకార్యాలయాలను కూడా టార్గెట్ చేస్తోంది. ఇద్దరు ప్రావిన్షియల్ గవర్నర్లను హత్య చేసింది. 2022 సెప్టెంబర్ లో రాజధానిలోని మైనారిటీ షియా స్టడీ హాలుపై బాంబు దాడి చేసింది. దీంట్లో 46 మంది బాలికలతో సహా 53 మంది మరణించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!