Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి.. లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
- చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి
- లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఆయన అభిమానులు, ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇలాంటి సమయంలో చార్లీ కిర్క్ హత్యపై టెలివిజన్ హోస్ట్ జమ్మీ కిమ్మెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతనిలో ఏదో తప్పు ఉంది కాబట్టే ఇలా జరిగిందంటూ చార్లీ కిర్క్ను ఉద్దేశించి జమ్మీ కిమ్మెల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ట్రంప్ తీరును కూడా తప్పుపడుతూ వ్యాఖ్యానించాడు. చార్లీ కిర్క్కు సంతాపాన్ని వ్యక్తం చేసే సమయంలో ట్రంప్ దు:ఖించిన విధానాన్ని కూడా జమ్మీ కిమ్మెల్ ఎగతాళి చేశాడు. నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిఫ్ కోసం దు:ఖించినట్లుగా ఉందని అపహాస్యం చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
జిమ్మీ కిమ్మెల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఏబీసీలో జిమ్మీ కిమ్మెల్ లైవ్షోను బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటించింది. అతడి షోను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఇక ఈ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని డెమెక్రటిక్ శాసనసభ్యులు తప్పుపట్టారు. వాక్ స్వాతంత్ర్యం దాడికి గురవుతుందని అన్నారు. ఏబీసీ నిర్ణయంపై ఇంకా జిమ్మీ కిమ్మెల్ స్పందించలేదు.
నెక్స్స్టార్ మీడియా గ్రూప్.. 32 ఏబీసీ అనుబంధ సంస్థలు కలిగి ఉంది. జిమ్మీ కిమ్మెల్ షోలు వీటిల్లో ప్రసారం అవుతుంటాయి. అయితే చార్లీ కిర్క్ హత్యను అపహాస్యం చేయడంతో జిమ్మీ కిమ్మెల్ షోలను నిలిపివేస్తున్నట్లు ఏబీసీ ప్రకటన చేసింది. చార్లీ కిర్క్పై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయని నెక్స్స్టార్ ప్రసార విభాగం అధ్యక్షుడు ఆండ్రూ ఆల్ఫోర్డ్ అన్నారు.
ఇదిలా ఉంటే సోమవారం టెక్సాస్ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక విద్యార్థి ఎగతాళి చేశాడు. దీంతో యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!