Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి.. లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
- చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి
- లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఆయన అభిమానులు, ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ఇలాంటి సమయంలో చార్లీ కిర్క్ హత్యపై టెలివిజన్ హోస్ట్ జమ్మీ కిమ్మెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతనిలో ఏదో తప్పు ఉంది కాబట్టే ఇలా జరిగిందంటూ చార్లీ కిర్క్ను ఉద్దేశించి జమ్మీ కిమ్మెల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ట్రంప్ తీరును కూడా తప్పుపడుతూ వ్యాఖ్యానించాడు. చార్లీ కిర్క్కు సంతాపాన్ని వ్యక్తం చేసే సమయంలో ట్రంప్ దు:ఖించిన విధానాన్ని కూడా జమ్మీ కిమ్మెల్ ఎగతాళి చేశాడు. నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిఫ్ కోసం దు:ఖించినట్లుగా ఉందని అపహాస్యం చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
జిమ్మీ కిమ్మెల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఏబీసీలో జిమ్మీ కిమ్మెల్ లైవ్షోను బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటించింది. అతడి షోను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఇక ఈ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని డెమెక్రటిక్ శాసనసభ్యులు తప్పుపట్టారు. వాక్ స్వాతంత్ర్యం దాడికి గురవుతుందని అన్నారు. ఏబీసీ నిర్ణయంపై ఇంకా జిమ్మీ కిమ్మెల్ స్పందించలేదు.
నెక్స్స్టార్ మీడియా గ్రూప్.. 32 ఏబీసీ అనుబంధ సంస్థలు కలిగి ఉంది. జిమ్మీ కిమ్మెల్ షోలు వీటిల్లో ప్రసారం అవుతుంటాయి. అయితే చార్లీ కిర్క్ హత్యను అపహాస్యం చేయడంతో జిమ్మీ కిమ్మెల్ షోలను నిలిపివేస్తున్నట్లు ఏబీసీ ప్రకటన చేసింది. చార్లీ కిర్క్పై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయని నెక్స్స్టార్ ప్రసార విభాగం అధ్యక్షుడు ఆండ్రూ ఆల్ఫోర్డ్ అన్నారు.
ఇదిలా ఉంటే సోమవారం టెక్సాస్ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక విద్యార్థి ఎగతాళి చేశాడు. దీంతో యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..