ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చార్కీ కిర్క్ వాదనలతో తాను ఏకీభవించడం లేదని తేల్చి చెప్పారు. ఇక చార్లీ హత్య తర్వాత ట్రంప్.. దేశాన్ని ఏకం చేయడం కాకుండా.. దేశాన్ని విభజిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు.
జాతీయవాది చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాంటీఫాను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించారు. చార్లీ కిర్క్ను హత్య చేసిన నిందితుడు యాంటీఫాకు చెందిన వాడిగా ఎఫ్బీఐ అనుమానించింది.