SCO Summit: ట్రెండింగ్గా మారిన ఐదు ఫొటోలు.. ఏవేవంటే..!
- ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన షాంఘై సహకార సదస్సు
- ట్రెండింగ్గా మారిన ఐదు ఫొటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సహా ఆయా దేశాల ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు. ఇక సమావేశం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపించారు. ఇక ఈ సమావేశంలో ఐదు ఫొటోలు హైలెట్గా నిలిచాయి. ప్రస్తుతం అవి ట్రెండింగ్గా మారాయి. ప్రపంచానికి ఒక సందేశం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఇక సమావేశానికి ముందు ఆయా దేశాధినేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సమయంలో మోడీ-పుతిన్-జిన్పింగ్ చాలా సేపు ముచ్చటించారు. ముగ్గురూ కూడా చాలా ఉల్లాసంగా.. ఉత్సాహం కనిపించారు. ఆద్యంతం మోడీ నవ్వుతూ కనిపించారు. ఇక మోడీ-పుతిన్ అయితే ఆలింగనం చేసుకుని షేక్హ్యాండ్లు ఇచ్చుకున్నారు.
ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు నిలబడుతుండగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లైన్లో నిలబడి ఉన్నారు. కానీ మోడీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పుతిన్తో ఏదో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. షెహబాజ్ మౌనంగా అలా ఉండిపోయారు. గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా పాక్ ప్రధాని వైపు చూసేందుకు ఇష్టపడలేదు. మళ్లీ ముగ్గురూ కలిసి సంభాషించుకున్నారు.
ఇక ఎస్సీవో సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చల కోసం మోడీ-పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఇద్దరం ఒకే కారులో ప్రయాణించినట్లు మోడీ పేర్కొన్నారు. పుతిన్తో సంభాషణలు ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. మోడీ-పుతిన్ ఉపయోగించిన కారు చైనా జాతీయ గౌరవంతో ముడిపడి ఉన్న కారు. దీన్ని అగ్ర నాయకులు, ప్రముఖుల కోసమే రూపొందించిన కారు.

ఇక ఆయా దేశాధి నేతల కుటుంబాలతో జిన్పింగ్ ఫొటోలు దిగారు. అనంతరం అందరూ కలిసి అధికారికంగా ఒక గ్రూప్ ఫొటో దిగారు. ఆ సమయంలో షెహబాజ్ షరీఫ్ను పట్టించుకోకుండా పుతిన్ వెళ్లిపోతుంటే.. షెహబాజే పరిగెత్తుకుంటూ వచ్చి పుతిన్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనిపై షరీఫ్పై భయంకరంగా ట్రోలింగ్ నడిచింది.

ఇదిలా ఉంటే శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కు మోడీ కరచాలనం ఇచ్చారు. వీపు తట్టి పలకరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ.. పాకిస్థాన్ వైపు నిలబడింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బీటలు వారాయి. బాయ్కట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో నినాదం నడిచింది. పాక్ ప్రధానిని తప్పించుకున్న.. టర్కీ అధ్యక్షుడితో మాత్రం తప్పించుకోవడం కుదరక షేక్హ్యాండిచ్చారు.

- Tags
- 5 pictures
- china
- modi
- Putin
- SCO Summit
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..