Turkey Earthquake: ఓ వైపు విషాదం, మరోవైపు దొంగతనాలు.. 48 మందిని అరెస్ట్ చేసిన టర్కీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake: భూకంపంలో టర్కీ విలవిల్లాడుతోంది. భారీ భూకంపం వల్ల గత కొన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని చూస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీని కోలుకోలేని దెబ్బతీశాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు కదిలిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారంటే, భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టర్కీతో పాటు సిరియాను భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 28 వేల మందికి పైగా ప్రజలు మరణించారు.
Read Also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో భారతీయుడి మృతి.. “ఓం” అనే పచ్చబొట్టుతో గుర్తింపు
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కన్నీరు కారుస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. భూకంపం ధాటికి తమవారిని కోల్పోయిన వారిలో ఆవేదన కట్టలుతెంచుకుంటోంది. బతికి బయటపడ్డవారు శిథిలాల కింద తమ వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు తీవ్ర విషాదం నెలకొని ఉంటే మరోవైపు దీన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు. దక్షిణ ప్రాంతమైన హటే ప్రావిన్స్ లో దోపిడికి పా్లపడినందుకు 42 మందిని, గాజియాంటెప్ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని మొత్తంగా 48 మందిని టర్కీ అధికారులు అరెస్ట్ చేశారు.
భూకంపం కారణంగా ఆగ్నేయ టర్కీలోని 10 ప్రావిన్సుల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందులో భాగంగా దోపిడీలకు పాల్పడుతున్న వారిని అదనంగా మూడు రోజుల పాటు నిర్భంధించవచ్చని అధికార ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు ప్రాసిక్యూటర్ల నాలుగు రోజలు నిర్భంధించే అవకాశం మాత్రమే ఉండేది. టర్కీ దోపిడీదారులపై కఠినంగా వ్యవహరిస్తుందని ఎర్డోగాన్ వార్నింగ్ ఇచ్చారు. దోపిడీలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న వ్యక్తులు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!