Turkey Earthquake: ఓ వైపు విషాదం, మరోవైపు దొంగతనాలు.. 48 మందిని అరెస్ట్ చేసిన టర్కీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake: భూకంపంలో టర్కీ విలవిల్లాడుతోంది. భారీ భూకంపం వల్ల గత కొన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని చూస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీని కోలుకోలేని దెబ్బతీశాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు కదిలిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారంటే, భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టర్కీతో పాటు సిరియాను భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 28 వేల మందికి పైగా ప్రజలు మరణించారు.
Read Also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో భారతీయుడి మృతి.. “ఓం” అనే పచ్చబొట్టుతో గుర్తింపు
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కన్నీరు కారుస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. భూకంపం ధాటికి తమవారిని కోల్పోయిన వారిలో ఆవేదన కట్టలుతెంచుకుంటోంది. బతికి బయటపడ్డవారు శిథిలాల కింద తమ వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు తీవ్ర విషాదం నెలకొని ఉంటే మరోవైపు దీన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు. దక్షిణ ప్రాంతమైన హటే ప్రావిన్స్ లో దోపిడికి పా్లపడినందుకు 42 మందిని, గాజియాంటెప్ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని మొత్తంగా 48 మందిని టర్కీ అధికారులు అరెస్ట్ చేశారు.
భూకంపం కారణంగా ఆగ్నేయ టర్కీలోని 10 ప్రావిన్సుల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందులో భాగంగా దోపిడీలకు పాల్పడుతున్న వారిని అదనంగా మూడు రోజుల పాటు నిర్భంధించవచ్చని అధికార ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు ప్రాసిక్యూటర్ల నాలుగు రోజలు నిర్భంధించే అవకాశం మాత్రమే ఉండేది. టర్కీ దోపిడీదారులపై కఠినంగా వ్యవహరిస్తుందని ఎర్డోగాన్ వార్నింగ్ ఇచ్చారు. దోపిడీలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న వ్యక్తులు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!