Turkey Earthquake: టర్కీ భూకంపంలో భారతీయుడి మృతి.. “ఓం” అనే పచ్చబొట్టుతో గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరసగా గంటల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల రెండు దేశాల్లో కలిపి 28,000 మందికి పైగా మరణించారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాలు తొలగించినా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.
ఇదిలా ఉంటే టర్కీ భూకంపంలో ఒక భారతీయుడు మరణించాడు. మృతుడిని ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ గా గుర్తించారు. బెంగళూర్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న విజయ్ కుమార్, అధికారిక పర్యటనలో భాగంగా టర్కీకి వెళ్లారు. అతను బస చేసి మాల్యతాలోని హోటల్ భూకంపం ధాటికి కుప్పకూలింది. దీంతో విజయ్ కుమార్ శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. విజయ్ కుమార్ ముఖం గుర్తుపట్టలేనంతగా నలిగిపోయింది. శుక్రవారం అతడి దుస్తులు దొరికాయి. అతని ఒంటిపై ఉన్న ‘ఓం’ అనే పచ్చబొట్టు ఆధారంగా మృతుడు విజయ్ కుమార్ అని గుర్తించారు.
Also Read
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
Read Also: Canada: చైనా పనేనా..? కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా
సోమవారం వచ్చిన భూకంపం తర్వాత విజయ్ కుమార్ ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే తిరిగి వస్తాడనుకున్న కుటుంబ సభ్యులకు ఈ చేదువార్త తెలిసింది. వ్యాపార పర్యటనలో ఉన్న విజయ్ కుమార్ మరణించినట్లు టర్కీలోని భారతరాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయన భౌతికకాయాన్ని ముందుగా ఇస్తాంబుల్కు తరలించి, అనంతరం ఢిల్లీకి తీసుకువెళతారు. అతని మృతదేహం స్వస్థలానికి చేరుకోవడానికి మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.
బెంగళూరులోని ఆక్సిప్లాంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్యాస్ ప్లాంట్ కంపెనీకి టెక్నీషియన్ అయిన కుమార్ జనవరి 25న టర్కీకి వెళ్లి మాలత్యలోని అవసర్ హాస్టల్లో బసచేస్తున్నారు. భూకంపం తర్వాత విజయ్ కుమార్ ను అతని అన్న అరుణ్ కుమార్ సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి ఫోన్ రింగ్ అవుతున్నా.. ఎవరూ స్పందించలేదు. చివరిసారిగా ఫిబ్రవరి 5న భార్య, ఆరేళ్ల కుమారుడితో ఫోన్ లో మాట్లాడారు. ఫిబ్రవరి 20న పని ముగించుకుని ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఈ లోపే భూకంపంలో మరణించారు.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!