Turkey Earthquake: టర్కీ భూకంపంలో భారతీయుడి మృతి.. “ఓం” అనే పచ్చబొట్టుతో గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరసగా గంటల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల రెండు దేశాల్లో కలిపి 28,000 మందికి పైగా మరణించారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాలు తొలగించినా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.
ఇదిలా ఉంటే టర్కీ భూకంపంలో ఒక భారతీయుడు మరణించాడు. మృతుడిని ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ గా గుర్తించారు. బెంగళూర్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న విజయ్ కుమార్, అధికారిక పర్యటనలో భాగంగా టర్కీకి వెళ్లారు. అతను బస చేసి మాల్యతాలోని హోటల్ భూకంపం ధాటికి కుప్పకూలింది. దీంతో విజయ్ కుమార్ శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. విజయ్ కుమార్ ముఖం గుర్తుపట్టలేనంతగా నలిగిపోయింది. శుక్రవారం అతడి దుస్తులు దొరికాయి. అతని ఒంటిపై ఉన్న ‘ఓం’ అనే పచ్చబొట్టు ఆధారంగా మృతుడు విజయ్ కుమార్ అని గుర్తించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Canada: చైనా పనేనా..? కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా
సోమవారం వచ్చిన భూకంపం తర్వాత విజయ్ కుమార్ ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే తిరిగి వస్తాడనుకున్న కుటుంబ సభ్యులకు ఈ చేదువార్త తెలిసింది. వ్యాపార పర్యటనలో ఉన్న విజయ్ కుమార్ మరణించినట్లు టర్కీలోని భారతరాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయన భౌతికకాయాన్ని ముందుగా ఇస్తాంబుల్కు తరలించి, అనంతరం ఢిల్లీకి తీసుకువెళతారు. అతని మృతదేహం స్వస్థలానికి చేరుకోవడానికి మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.
బెంగళూరులోని ఆక్సిప్లాంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్యాస్ ప్లాంట్ కంపెనీకి టెక్నీషియన్ అయిన కుమార్ జనవరి 25న టర్కీకి వెళ్లి మాలత్యలోని అవసర్ హాస్టల్లో బసచేస్తున్నారు. భూకంపం తర్వాత విజయ్ కుమార్ ను అతని అన్న అరుణ్ కుమార్ సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి ఫోన్ రింగ్ అవుతున్నా.. ఎవరూ స్పందించలేదు. చివరిసారిగా ఫిబ్రవరి 5న భార్య, ఆరేళ్ల కుమారుడితో ఫోన్ లో మాట్లాడారు. ఫిబ్రవరి 20న పని ముగించుకుని ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఈ లోపే భూకంపంలో మరణించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!