Bus-Tanker Accident: బస్సు- ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus-Tanker Accident: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ప్రయాణీకుల వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మూడు రోజుల్లో ప్రావిన్స్లో జరిగిన రెండవ అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఇది అని రెస్క్యూ అధికారులు తెలిపారు. లాహోర్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్లోని హైవేపై అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలపాటు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
“లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది మరణించారు. ఢీకొన్న తర్వాత, బస్సు మరియు ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకోగా ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ” అని పాకిస్థాన్ రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాలిన గాయాలకు గురైన వారిని ముల్తాన్లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది.మరణించిన చాలా మంది ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ మృతదేహాలను డీఎన్ఏ పరీక్ష తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని… సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు .అయితే.. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
PM Narendra Modi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ప్రధాని మోదీ బర్త్డే విషెస్
ప్రమాదంలో విలువైన ప్రాణాలు కోల్పోవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత ఆరోగ్య అధికారులను ఆదేశించారు. అలాగే మరణించిన వారి కుటుంబాలను గుర్తించేందుకు సహకరించాలని ఆదేశించారు. శనివారం పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో లోడుతో కూడిన ట్రక్కు ప్రయాణీకుల బస్సును ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!