Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
16 Killed, 24 Injured After Blast In Afghanistan:ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ సమంగాన్ ప్రావిన్షియల్ ప్రావిన్స్ లోని అయ్బాక్ నగరంలోని మదర్సాలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడు వెల్లడించాడు.
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
చనిపోయిన వారిలో మదర్సాలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా తాలిబాన్ వర్గాలు స్పందించలేదు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే గత ఏడాది ఆగస్టులో అమెరికా వైదొలిగిన తర్వాత ఆఫ్ఘాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే వీరు అధికారం తీసుకున్నప్పటి నుంచి అక్కడ ఐసిస్ ఖొరాసన్ తీవ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పలు మసీదుల్లో, సిక్కు ప్రార్థనా మందిరాలపై దాడులు చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, ఖుర్దులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
మరోవైపు తమ తలతిక్క నిర్ణయాలతో అఫ్ఘాన్ భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు తాలిబాన్లు. అక్కడ షరియా చట్టాలు తీసుకువచ్చి స్త్రీలకు హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీలను చదువుకు దూరం చేశారు. ఇదిలా ఉంటే తాలిబాన్ల నిర్ణయాల వల్ల ప్రపంచదేశాలు ఆఫ్ఘానిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. దీంతో అక్కడ విపరీతమైన పేదరికం ఏర్పడింది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో డ్యూరాండ్ రేఖపై స్పష్టత లేకపోవడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!