Shraddha Walkar Case: 20 మంది హిందూ యువతులతో సంబంధం.. ఉరివేసినా “జన్నత్” లభిస్తుందంటూ అఫ్తాబ్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaftab Poonawala Confessed In Polygraph Test, No Remorse: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో అఫ్తాబ్ పూనావాలా కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శద్ధావాకర్ని హత్య చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఉరి శిక్ష వేసినా నాకు జన్నత్ ( స్వర్గం) లభిస్తుందని, తనను హీరోగా గుర్తుంచుకుంటారని పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పినట్లు సమాచారం. శ్రద్ధాతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే 20 మంది హిందూ యువతులతో అఫ్తాబ్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు అంగీకరించారు.
బంబుల్ యాప్ ఉపయోగించి ముఖ్యంగా హిందూ అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుని తన ట్రాపులో పడేసే వాడినని అఫ్తాబ్ వెల్లడించాడు. శ్రద్ధ హత్య తర్వాత ఓ సైకాలజిస్టులో డేటింగ్ మొదలు పెట్టాడు. తనూ కూడా ఓ హిందూ మహిళే అని.. ఆమెను సంబంధంలోకి దింపేందుకు శ్రద్ధాకు చెందిన ఓ ఉంగరాన్ని కూడా గిఫ్టుగా ఇచ్చినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనేక మంది హిందూ అమ్మాయిలతో టచ్ లో ఉండే వాడని తెలుస్తోంది. శ్రద్ధాను చంపిన తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా చేసిన తర్వాత తనకు బాధ అనిపించలేదని.. ముంబైలోనే శ్రద్ధాను హత్య చేద్దాం అని ప్లాన్ వేసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
Read Also: Mumbai: సవతి కూతురుపై అత్యాచారం.. డీఏన్ఏ పరీక్ష ఆధారంగా కోర్టు తీర్పు..
పాలిగ్రాఫ్ టెస్టులో శ్రద్ధా వాకర్ ను తానే హత్య చేసినట్లు అఫ్తాబ్ అంగీకరించాడు. ఢిల్లీ న్యాయస్థానం అనుమతితో ఇప్పటికే అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించారు. మరోసారి డిసెంబర్ 1,5 తేదీల్లో మళ్లీ నార్కో పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీలోని రోహిణిలోని ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో నార్కో టెస్టులు చేయనున్నారు. నార్కో అనాలిసిస్ టెస్టులను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దని హెచ్చరించింది.
మే 18న లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధా వాకర్ని అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ మోహ్రౌలి సమీపంలోని ఛత్తార్ పూర్ ప్రాంతంలో శరీర భాగాలను పడేశాడు. శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో నవంబర్ 14న ఈ భయంకరమై కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శ్రద్ధాకు చెందిన ఎముకలు, రక్తపు నమూనాలను సేకరించిన పోలీసులు డీఎన్ఏ పరీక్ష కోసం పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది. నిందితుడిని అరెస్టు చేసి, ఐపిసి సెక్షన్ 302 (హత్య) , 201 (చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలు అదృశ్యం కావడం) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!