Philippines: ఫిలిప్పీన్స్లో భారీగా వరదలు.. 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
13 Killed, 23 Missing In Philippines Floods: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వర్షాలు, వరదల కారణంగా మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. క్రిస్మస్ రోజు కురిసిన భారీ వర్షాల వల్ల దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. మరో 23 మంది మత్స్యకారులు తప్పిపోయారు. దేశంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించడమే కాకుండా ఇప్పటి వరకు 45,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వీరిందరిని సహాయక కేంద్రాలకు తరలించారు. వాతావరణం బాగా లేకున్నా.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. ప్రస్తుతం వీరంతా గల్లంతయ్యారు.
Read Also: India Squad: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్లకు భారత జట్టు ప్రకటన
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
పొంగిపొర్లుతున్న నదుల వల్ల పన్నెండు రోడ్లు మునిగిపోయాయి. దీంతో దేశంలో రవాణాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిలిప్పీన్స్ వాతావరణ కేంద్రం ప్రకారం.. షీర్ లైన్ అనే వాతావరణ పరిస్థితులు కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.
రాజధాని మనీలకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరైన్స్ సుర్ ప్రావిన్స్ లో వేర్వేరు ఘటనల్లో మునిగిపోయి బాలికతో పాటు వృద్ధుడు మరణించారు. దేశంలోని దక్షిణ ప్రావిన్సులో నలుగురు వ్యక్తులు మరణించారు. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. రెస్క్యూ ప్రయత్నాలను కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు దేశంలోని వ్యవసాయంపై భారీగా ప్రభావం చూపించాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!