Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ వరస భూకంపాలతో భయపడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దక్షిణ ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం వణికించింది. ఫిలిప్పీన్స్లోని మనీలాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. అమెరికన్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
13 Killed, 23 Missing In Philippines Floods: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వర్షాలు, వరదల కారణంగా మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. క్రిస్మస్ రోజు కురిసిన భారీ వర్షాల వల్ల దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. మరో 23 మంది మత్స్యకారులు తప్పిపోయారు.