Turkey: ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 12 మంది మృతి
- టర్కీ ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- 12 మంది మృతి.. నలుగురికి గాయాలు
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీలోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలికేసిర్ ప్రావిన్స్లో ఉన్న క్యాప్సూల్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఎవరూ లేరని, మంటలు ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: చిక్కడపల్లి పీఎస్లో అల్లు అర్జున్ విచారణ పూర్తి
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ప్రమాదం తర్వాత ప్లాంట్ చుట్టూ గాజు మరియు మెటల్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులు భగవంతుని దయతో త్వరగా కోలుకోవాలని స్థానిక గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావోగ్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు ఇంటీరియర్ మంత్రి వెల్లడించించారు. ప్రమాదానికి గల కారణాలను వెంటనే చెప్పలేమన్నారు. ప్రమాదం జరిగిన వేళ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష
ప్రమాదం పట్ల టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘12 మంది సోదరుల మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. సంబంధిత సంస్థల ద్వారా తనకు సమాచారం అందించామని, వెంటనే సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించామని’’ ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 8:25 గంటలకు పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ప్లాంట్లోని కొంత భాగం కూలిపోయింది. పేలుడుకు కారణం ఇంకా అస్పష్టంగా ఉందని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!