Turkey: ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 12 మంది మృతి
- టర్కీ ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- 12 మంది మృతి.. నలుగురికి గాయాలు
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీలోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలికేసిర్ ప్రావిన్స్లో ఉన్న క్యాప్సూల్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఎవరూ లేరని, మంటలు ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: చిక్కడపల్లి పీఎస్లో అల్లు అర్జున్ విచారణ పూర్తి
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ప్రమాదం తర్వాత ప్లాంట్ చుట్టూ గాజు మరియు మెటల్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులు భగవంతుని దయతో త్వరగా కోలుకోవాలని స్థానిక గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావోగ్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు ఇంటీరియర్ మంత్రి వెల్లడించించారు. ప్రమాదానికి గల కారణాలను వెంటనే చెప్పలేమన్నారు. ప్రమాదం జరిగిన వేళ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష
ప్రమాదం పట్ల టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘12 మంది సోదరుల మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. సంబంధిత సంస్థల ద్వారా తనకు సమాచారం అందించామని, వెంటనే సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించామని’’ ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 8:25 గంటలకు పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ప్లాంట్లోని కొంత భాగం కూలిపోయింది. పేలుడుకు కారణం ఇంకా అస్పష్టంగా ఉందని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!