Iran-Israel War: ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులు తరలింపు
- ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులు తరలింపు
- బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకోనున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తం అయింది. భారతీయులను అలర్ట్ చేసింది. తక్షణమే ఖాళీ చేయాలని సూచించింది. ఇందులో భాగంగా 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ అర్మేనియం చేరుకుంది. బుధవారం ఉదయం కల్లా ఢిల్లీ ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఇక సొంత వనరులు కలిగిన వారు కూడా తరలి వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Pooja Hegde : పాత పరిచయాలతో, మళ్లీ టై అప్ అవుతున్న పూజా హెగ్డే ?
Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
ఇక అత్యవసర పరిస్థితుల్లో భారతీయ పౌరులందరూ వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా కోరింది. ఎలాంటి అవసరత వచ్చినా ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. +989010144557,+989128109115, +989128109109 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Retro : సూర్య ‘రెట్రో’ వెబ్ సిరీస్గా రానుందా..?
చైనా, టర్కీ, యూకే వంటి అనేక దేశాలు ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇక ఆదివారం టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య జరగాల్సిన అణు చర్చలు రద్దయ్యాయి.
ఇక జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధాంతరంగా.. ఆగమేఘాలపై అమెరికాకు వెళ్లిపోయారు. భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ , ఇరానియన్ సాయుధ దళాలు రెండింటికీ నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో షాద్మానీ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. ఖమేనీని చంపితేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ట్రంప్ అడ్డుపడడంతోనే ఖమేనీ బతికిపోయాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఖమేనీ బంకర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?