Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా..షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది.ఇవాళ మధ్యాహ్నం 2.30 కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఆ తరువాత 3 గంటలకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ ని సందర్శించనున్నారు అమిత్ షా.
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
4.30 గంటల వరకు అక్కడే ఉండనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా… 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని నోవా టెల్ హోటల్ కి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలికి రానున్నారు అమిత్ షా. ఈ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ రాత్రి 8 గంటలకు సభ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 8.25 కి తిరిగి ఢిల్లీ ప్రయాణం కానున్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
బండి సంజయ్ ఏప్రిల్ 14తో తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాఫీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాడేందుకు బండి సంజయ్ తన పాదయాత్రను చేపట్టారని వారు తెలిపారు.
పాలమూరు (Mahbubnagar) జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు (మే 14)న మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్ షా రానున్న నేపథ్యంతో ఉత్కంఠత చోటుచేసుకుంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్పై కేంద్రం, బీజేపీ రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో అమిత్ షా రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ఆయన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శల చేస్తారు ? ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్ నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?