Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Girl Commits Suicide In Medak After Husband Leaves Her: ప్రేమన్నాడు.. నువ్వు లేకుండా బ్రతకలేనన్నాడు.. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. పాపం.. ఆ అమ్మాయి అతని మాయమాటల్లో పడి ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. పెళ్లయ్యాక అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. రెండంటే రెండు రోజులకే ఆ అమ్మాయిని వదిలేశాడు. తమ కులాలు వేరు కాబట్టి, కలిసి జీవించడం కష్టమని చెప్పాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం చేయమని వేడుకున్నా.. ఒక్కరు కూడా కనికరించకపోవడంతో పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్ను వదిలేసి కుట్లేశారు..!
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఆ వివరాల్లోకి వెళ్తే.. తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18) వెంటపడ్డాడు. నువ్వు లేకుండా ఉండలేనని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో.. తేజశ్రీ అతని ప్రేమని అంగీకరించింది. అలా మూడేళ్లు ప్రేమించుకున్న వీళ్లిద్దరు.. గతేడాది అక్టోబర్ 15వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం కాపురం చేసుకుంటామని.. అక్టోబర్ 19వ తేదీన పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు. అయితే.. ప్రేమించినప్పుడు అడ్డు రాని కులాల వ్యవహారాన్ని పెళ్లయ్యాక యశ్వంత్రెడ్డి లేవనెత్తాడు. ఇద్దరిది వేర్వేరు కులాలు కాబట్టి.. తాను కలిసి ఉండలేనంటూ యశ్వంత్ ఆ యువతిని వదిలి వెళ్లిపోయాడు.
Formula E Hyderabad: ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్షిప్.. బుక్ మై షోలో టికెట్స్
భర్త వదిలేయడంతో కుంగిపోయిన తేజశ్రీ.. తనకు న్యాయం చేయమని కులపెద్దల్ని ఆశ్రయించింది. వాళ్లు ఆమెకి అండగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. యశ్వంత్ తిరిగి కాపురానికి రావాలని నిలదీశారు. అయినా న్యాయం జరగలేదు. దీంతో తేజశ్రీ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నెలరోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. కుటుంబీకులు తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్ ఇంటి వద్ద ఉంచి, ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాళ్లు ఆందోళన విరమించి, తేజశ్రీ అంత్యక్రియలు చేశారు.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!