Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్ను వదిలేసి కుట్లేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Towel Inside Stomach: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన ఘటన యూపీలోని అమ్రోహాలో జరిగింది. అమ్రోహాలోని ఓ ఆస్పత్రిలో ప్రసవ వేదనతో గర్భిణీ చేరగా.. వైద్యుడు ఆపరేషన్ చేసి టవల్ను కడుపులో మర్చిపోయాడు. ఈ కేసుపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ సమగ్ర విచారణక ఆదేశించారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమ్రోహాలోని నౌగావానా సాదత్ పీఎస్ పరిధిలో డాక్టర్ మత్లూబ్ అనుమతి లేకుండా సైఫీ నర్సింగ్ హోమ్ను నడుపుతున్నాడు. ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు ఆయన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం కడుపులో టవల్ను పెట్టి అలాగే కుట్లు వేశాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా టవల్ కడుపులో ఉండిపోయింది. ఆ మహిళ కడుపు నొప్పి అని చెప్పడంతో ఆ వైద్యుడు ఆమెను ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని చెప్పాడు. బయట చలి కారణంగా ఆమె ఈ కడుపు నొప్పిని ఎదుర్కొంటుందని పేర్కొన్నాడు.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
Hyderabad Crime: బైక్ నంబర్ ప్లేట్కు ఫేస్ మాస్క్.. కానీ మూల్యం చెల్లించక తప్పలేదు..
ఐదు రోజుల తర్వాత వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినా ఆరోగ్యం బాగోకపోవడంతో ఆ మహిళ భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రోహాలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కడుపునొప్పి వెనుక అసలు నిజం బయటపడింది. కడుపులో టవల్ ఉందని తెలుసుకుని వైద్యులు మరో ఆపరేషన్ చేసి టవల్ తీసేశారు. ప్రైవేట్ డాక్టర్ మత్లూబ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ షంషేర్ అలీ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి తనకు మీడియా నివేదికల ద్వారా తెలిసిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని నోడల్ అధికారి డాక్టర్ శరద్ను కోరానన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలను చెప్పగలమని సీఎంవో సింఘాల్ మంగళవారం తెలిపారు. అయితే, షంషేర్ అలీ ఈ వ్యవహారంపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని, విచారణ జరుగుతుందని సీఎంవో హామీ ఇచ్చారు. సీఎంవో విచారణ నివేదిక రాగానే పోలీసులు విచారణ ప్రారంభిస్తారని పేర్కొనడం గమనార్హం.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!