FIR: రన్నింగ్ ట్రైన్లో దారుణం.. వంట గదికి తీసుకెళ్లి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యాచార ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఎక్కడో ఓ దగ్గర దారుణమైన ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి.. తాజాగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో దారుణమైన ఘటన బయటపడింది.. కదులుతున్న రైలులోనే ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది.. నివేదికల ప్రకారం ఢిల్లీకి చెందిన యువతి.. ముంబై నుండి ఢిల్లీకి తిరిగి వెళ్తుంది.. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది… బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన వద్ద ధృవీకరించబడిన టికెట్ లేదని, అందుకే తాను రైలులోని AC-III కోచ్ వెలుపల కూర్చున్నానని పేర్కొంది.. రైలు హర్దా రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా, ప్యాంట్రీ కార్ మేనేజర్ వచ్చి ఆమెను జనరల్ కోచ్కి వెళ్లమని సూచించగా.. ఇది సుదీర్ఘ ప్రయాణం కాబట్టి, తనను ఏసీ కోచ్ బయట కూర్చోవడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థించింది.
Read Also: KCR: యాదాద్రి కూడా హైదరాబాద్లో కలిసిపోయింది..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
అయితే, కంపార్ట్మెంట్ బయట కూర్చోవడం ఆమెకు సురక్షితం కాదని మేనేజర్ ఆమెను ప్యాంట్రీ కార్ కోచ్కి రప్పించాడు.. ఆ తర్వాత నిద్రిస్తున్న తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు.. ఎవరికైనా చెబితే రన్నింగ్ ట్రైన్లోంచి బయటకి తోసివేస్తానని బెదిరించాడని సదరు యువతి GRP సిబ్బందికి చెప్పింది. దీంతో.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తామని జీఆర్పీ అధికారి వెల్లడించారు.. శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని GRP సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హితేష్ చౌదరి తెలిపారు. రైలులో దాక్కున్న అనుమానితుడిని ఝాన్సీ రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు తెలిపారు. బాధితురాలు భోపాల్లో దిగి, జరిగిన ఘోరాన్ని GRPకి వివరించినట్లు ఎస్పీ తెలిపారు. అరగంట సేపు ఆగిన తర్వాత కొందరు వ్యాపారులను పోలీసులు విచారించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు.. ఈ ఘటనలో కొందరు చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!