FIR: రన్నింగ్ ట్రైన్లో దారుణం.. వంట గదికి తీసుకెళ్లి..!
అత్యాచార ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఎక్కడో ఓ దగ్గర దారుణమైన ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి.. తాజాగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో దారుణమైన ఘటన బయటపడింది.. కదులుతున్న రైలులోనే ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది.. నివేదికల ప్రకారం ఢిల్లీకి చెందిన యువతి.. ముంబై నుండి ఢిల్లీకి తిరిగి వెళ్తుంది.. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది… బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన వద్ద ధృవీకరించబడిన టికెట్ లేదని, అందుకే తాను రైలులోని AC-III కోచ్ వెలుపల కూర్చున్నానని పేర్కొంది.. రైలు హర్దా రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా, ప్యాంట్రీ కార్ మేనేజర్ వచ్చి ఆమెను జనరల్ కోచ్కి వెళ్లమని సూచించగా.. ఇది సుదీర్ఘ ప్రయాణం కాబట్టి, తనను ఏసీ కోచ్ బయట కూర్చోవడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థించింది.
Read Also: KCR: యాదాద్రి కూడా హైదరాబాద్లో కలిసిపోయింది..
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
అయితే, కంపార్ట్మెంట్ బయట కూర్చోవడం ఆమెకు సురక్షితం కాదని మేనేజర్ ఆమెను ప్యాంట్రీ కార్ కోచ్కి రప్పించాడు.. ఆ తర్వాత నిద్రిస్తున్న తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు.. ఎవరికైనా చెబితే రన్నింగ్ ట్రైన్లోంచి బయటకి తోసివేస్తానని బెదిరించాడని సదరు యువతి GRP సిబ్బందికి చెప్పింది. దీంతో.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తామని జీఆర్పీ అధికారి వెల్లడించారు.. శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని GRP సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హితేష్ చౌదరి తెలిపారు. రైలులో దాక్కున్న అనుమానితుడిని ఝాన్సీ రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు తెలిపారు. బాధితురాలు భోపాల్లో దిగి, జరిగిన ఘోరాన్ని GRPకి వివరించినట్లు ఎస్పీ తెలిపారు. అరగంట సేపు ఆగిన తర్వాత కొందరు వ్యాపారులను పోలీసులు విచారించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు.. ఈ ఘటనలో కొందరు చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!