Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడిని హత్య చేయడమో లేక భర్తనే ప్రియుడి సాయంతో భార్య హతమార్చడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. జమ్మూకి చెందిన ఓ మహిళ ప్రియుడి సాయంతో తన భర్తను హతమార్చింది.
వివరాల్లోకి వెళ్తే.. 33 ఏళ్ల భర్తను ప్రియుడి సాయంతో హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఓ భార్య ప్రయత్నించి పట్టుబడింది. ఈ కేసులో సదరు మహిళ, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. దోడాలోని భద్వేరాకు చెందిన నరేష్ చందర్ని ఏప్రిల్ 7 తెల్లవారుజామున జమ్మూలోని గాంధీనగర్ ఆస్పత్రికి అతని భార్య షల్లుదేవీ తీసుకువచ్చారు. నగరంలోని పౌనిచక్లోని గోలే గుజ్రాల్ ప్రాతంలో ప్రమాదం జరిగి చందర్ గాయపడ్డాడని పేర్కొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగా షల్లూదేవీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. నరేష్ చందర్ మృతిపై పోస్టుమార్టం నిర్వహించి దోమన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
Read Also: Yogi Adityanath: బాణాసంచా పేలినా పాకిస్తాన్ వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది..
అయితే, దర్యాప్తులో షల్లూదేవీ చెప్పే విషయాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పోలీసులు గుమనించారు. దీని ప్రకారం సాంకేతిక ఆధారాలు సేకరించారు. చందర్ చనిపోయిన గాంధీ నగర్ ఆస్పత్రిలో ట్రైనీగా పనిచేస్తున్న భాను ప్రతాప్ సింగ్తో షల్లూదేవికి అక్రమ సంబంధం ఉన్నట్లు సమగ్ర విచారణలో తేలింది. నిందితులు షల్లూదేవీ, ప్రతాప్ సింగ్లు నరేష్ చందర్ని సియోరా గ్రామంలో పాడుబడిన స్థలానికి రప్పించి హత్య చేసినట్లు అంగీకరించారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదమని నాటకమాడి తప్పించుకునే ప్రయత్నం చేశారు. భాను సింగ్ ఆదే ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై హత్యానేరం మోపబడింది. తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!