Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడిని హత్య చేయడమో లేక భర్తనే ప్రియుడి సాయంతో భార్య హతమార్చడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. జమ్మూకి చెందిన ఓ మహిళ ప్రియుడి సాయంతో తన భర్తను హతమార్చింది.
వివరాల్లోకి వెళ్తే.. 33 ఏళ్ల భర్తను ప్రియుడి సాయంతో హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఓ భార్య ప్రయత్నించి పట్టుబడింది. ఈ కేసులో సదరు మహిళ, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. దోడాలోని భద్వేరాకు చెందిన నరేష్ చందర్ని ఏప్రిల్ 7 తెల్లవారుజామున జమ్మూలోని గాంధీనగర్ ఆస్పత్రికి అతని భార్య షల్లుదేవీ తీసుకువచ్చారు. నగరంలోని పౌనిచక్లోని గోలే గుజ్రాల్ ప్రాతంలో ప్రమాదం జరిగి చందర్ గాయపడ్డాడని పేర్కొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగా షల్లూదేవీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. నరేష్ చందర్ మృతిపై పోస్టుమార్టం నిర్వహించి దోమన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
Read Also: Yogi Adityanath: బాణాసంచా పేలినా పాకిస్తాన్ వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది..
అయితే, దర్యాప్తులో షల్లూదేవీ చెప్పే విషయాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పోలీసులు గుమనించారు. దీని ప్రకారం సాంకేతిక ఆధారాలు సేకరించారు. చందర్ చనిపోయిన గాంధీ నగర్ ఆస్పత్రిలో ట్రైనీగా పనిచేస్తున్న భాను ప్రతాప్ సింగ్తో షల్లూదేవికి అక్రమ సంబంధం ఉన్నట్లు సమగ్ర విచారణలో తేలింది. నిందితులు షల్లూదేవీ, ప్రతాప్ సింగ్లు నరేష్ చందర్ని సియోరా గ్రామంలో పాడుబడిన స్థలానికి రప్పించి హత్య చేసినట్లు అంగీకరించారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదమని నాటకమాడి తప్పించుకునే ప్రయత్నం చేశారు. భాను సింగ్ ఆదే ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై హత్యానేరం మోపబడింది. తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!