Yogi Adityanath: బాణాసంచా పేలినా పాకిస్తాన్ వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఛత్తీస్గఢ్ కోర్బాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. దేశంలో శాంతిభద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీని కొనియాడారు. ఈ రోజు భారత్లో ఎక్కడైనా టపాసులు పేలినా, తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చే స్థాయికి పాకిస్తాన్ వచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ పాలనకు 2014కి ముందు కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసాన్ని చూపుతూ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kaikaluru Constituency : వైసీపీలోకి భారీ చేరికలు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న 400 మంది
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఆకలితో మరణించారని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, యువత వలసపోయిందని అన్నారు. దేశంలో ఉగ్రవాదులు చొరబడి ఎక్కడైనా బాంబులను పేల్చేవారని, కానీ నేడు దేశంలో ఎక్కడైనా బాణాసంచా పేలినా కూడా పాకిస్తాన్ వివరణ ఇచ్చే పరిస్థితికి తీసుకువచ్చామని చెప్పారు. ఏదైనా దాడి చేస్తే, ఇప్పుడున్న కొత్త భారత్ వారి భూభాగాల్లోకి చొరబడి దాడి చేస్తారని వారికి తెలుసు కాబట్టి, ఏ చిన్న పేలుడు జరిగినా తమ ప్రమేయం లేదని చెబుతోందని అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి రెండు విడతల్లో ఛత్తీస్గఢ్లోని 11 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడతలో బస్తర్ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగగా, ఏప్రిల్ 26న రెండో దశలో రాజ్నంద్గావ్, మహాసముంద్, కాంకేర్ మూడు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 7న మూడో దశలో 7 నియోజకవర్గాలు – సుర్గుజా, రాయ్గఢ్, జంజ్గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్ మరియు రాయ్పూర్లకు ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలోని 543 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!