Extramarital affair: “లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ”.. కొడుకు సాక్ష్యంతో వెలుగులోకి నేరం..
- లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ..
- 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో దారుణం వెలుగులోకి..
- సంచలనంగా రాజస్థాన్ అల్వార్ మర్డర్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital affair: లవర్తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు చెప్పుకొచ్చింది. అయితే, వీరి కుమారుడు పోలీసులకు సంఘటన గురించి వివరించాడు. 48 గంటల్లోనే అసలు నిందితులు ఎవరనేది తెలిసింది.
బాలుడు చెబుతున్న దాని ప్రకారం, అతడి తల్లి ఆ రాత్రి ఉద్దేశపూర్వకంగానే ఇంటి ప్రధాన గేట్లను తెరించింది. అర్థరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఈ నలుగురితో పాటు అనిత లవర్ కాశీరాం ప్రజాపత్ కూడా ఉన్నాడు. బాలుడు ఇతడిని ‘‘కాశీ అంకుల్’’ అని పిలుస్తాడు. వీరు మాన్ సింగ్ నిద్రలో ఉండగా, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ సమయంలో తాను ఈ హత్యను చూసినట్లు బాలుడు వెల్లడించాడు.
Also Read
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
Read Also: Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!
“నేను ఇప్పుడే నిద్రలోకి జారుకున్నప్పుడు తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నా తల్లి గేటు తెరవడం చూశాను. కాశీ అంకుల్ బయట నిలబడి ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నేను భయపడ్డాను, నేను లేవలేదు, నేను నిశ్శబ్దంగా అంతా చూడటం ప్రారంభించాను. వారు మా గదికి వచ్చారు. నా తల్లి మంచం ముందు నిలబడి ఉండటం చూశాను. ఆ వ్యక్తులు అతనిని కొట్టారు, అతని కాళ్ళను పట్టుకుని, గొంతు నులిమారు. కాశీ అంకుల్ నాన్న నోటిని దిండుతో అదిమాడు. నేను నా తండ్రి కోసం చేయి చాపినప్పుడు కాశీ అంకుల్ నన్ను తన ఒడిలో ఎత్తుకుని తిట్టి బెదిరించాడు,” అని బాలుడు చెప్పాడు. భయంతో నేను మౌనంగా ఉన్నానని, కొన్ని నిమిషాల తర్వాత నాన్న చనిపోయారని, ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయినట్లు చెప్పాడు.
పోలీసులు దర్యాప్తులో అనిత, కాశీరాం మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఖేర్లిలో అనిత ఒక చిన్న జనరల్ స్టోర్ నడుపుతోంది, ఇదే సమయంలో స్థానికంగా కచోరీలు అమ్మే కాశీరాం అనే వీధి వ్యాపారితో పరిచయమైంది. కాలక్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అనిత, కాశీరామ్ కలిసి నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్కి రూ. 2 లక్షలు హత్య కోసం ఆఫర్ చేశారు.
ముందుగా, బంధువులకు మాన్ సింగ్ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు చెప్పింది. అయితే, అతడి ఒంటిపై గాయాలు, విరిగిన పళ్లు వంటి గుర్తులు కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైద్య పరీక్షల్లో హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో అనిత , కాశీరామ్, కాంట్రాక్ట్ కిల్లర్స్లో ఒకరైన బ్రిజేష్ జాతవ్ అను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!