India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
- భారత్లో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పర్యటన.
- ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక సమావేశం.
- ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య రంగాల్లో సహకారంపై చర్చలు.
- డెల్సీ రోడ్రిగ్జ్కు ఇది ఆరవ భారత పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 3 నుండి 7 వరకు భారతదేశంలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. జూన్ 1న జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆమె భారత్ రావాల్సి ఉంది. అయితే, ఈ సదస్సు వాయిదా పడిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. రోడ్రిగ్జ్తో పాటు పలువురు మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో భాగం కానుంది. ఆమెతో పాటు విదేశాంగ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సమాచార, రవాణా శాఖల మంత్రులతో సహా పలువురు మంత్రులు కూడా ఉంటారని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.
రోడ్రిగ్జ్కు భారత్తో చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. విదేశాంగ మంత్రిగా, ఉపాధ్యక్షురాలిగా ఆమె పలుమార్లు భారత్ సందర్శించారు. 2015లో విదేశాంగ మంత్రిగా 2019, 2023, 2024, 2025లలో ఉపాధ్యక్షురాలిగా భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
భారత ప్రభుత్వ రంగ సంస్థలు వెనిజులా ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయని, ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు అన్వేషించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని జైస్వాల్ అన్నారు. ఇంధనం, వాణిజ్యం, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు మరింత సహకారాన్ని పెంచుకోనున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!