AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
- మొగుడిపై కోపం
- రాజస్తాన్లోని అజ్మీర్లో ఈ ఖతర్నాక్ వైఫ్ బాగోతం
- అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకుంది మొదటి భార్య. కొడుకు, కూతురుతో కలిసి ఘాతుకానికి పాల్పడింది. పైగా ఆ సామూహిక హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగలేదు.. ఆ మాజీ ఇల్లాలు.. భర్త పోయాడని తెలిసి గుండెలు బాదుకుంటూ డ్రామా రక్తి కట్టించింది. కానీ పోలీసులు దర్యాప్తులో అమ్మగారి బాగోతం అంతా వెలుగు చూసింది. ఆమె కపట నాటకాన్ని బయట పెట్టిన పోలీసులు.. కటకటాల్లోకి నెట్టారు. రాజస్తాన్లోని అజ్మీర్లో ఈ ఖతర్నాక్ వైఫ్ బాగోతం వెలుగు చూసింది.
రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలోని హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. తొలుత పోలీసులు.. స్థానికుల తరహాలోనే దీన్ని ఓ ప్రమాదంగానే భావించారు. కానీ వారి దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ కారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పొలాల్లో కత్తి గాట్లతో మరో మృతదేహం పడి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి, ఆయన రెండో భార్య, మేనకోడలుగా గుర్తించారు. ఐతే పోలీసుల దర్యాప్తు క్రమంలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
రామ్ సింగ్, సునీతకు 2005లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే సునీతకు ఇష్టం లేకుండా రామ్సింగ్.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై వీరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. హత్య జరిగే కంటే ఒక రోజు ముందు కూడా వీరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో కుమార్తె సరిత, మైనర్ కుమారుడితో కలిసి రామ్సింగ్ను హత్య చేసేందుకు సునీత ప్లాన్ చేసింది.
తన ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని భావించిన సునీత.. ఇందుకోసం ఆన్లైన్లో ముందుగానే కత్తిని కూడా కొనుగోలు చేసింది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న రామ్సింగ్పై కొడుకు, కూతురి సాయంతో దాడి చేసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మిగిలిన వారిని కూడా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. దర్యాప్తు క్రమంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు సునీత, ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుడిని అరెస్టు చేశారు.
పోలీసుల మందు డ్రామా రక్తి కట్టించింది
ఈ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించింది సునీత. తనకు ఏమీ తెలియదనట్లు చెప్పుకొచ్చింది. పైగా భర్త చనిపోయాడని ఎక్కడలేని బాధతో గుండెలు బాదుకుంటూ రోదించింది. పోలీసుల మందు డ్రామా రక్తి కట్టించింది. పాపం ఆ పోలీసులు కూడా నిజమోనని నమ్మారు. సీన్ కట్ చేస్తే..పలు సాంకేతిక ఆధారాల ద్వారా హత్య చేసింది ఆమేనని దర్యాప్తులో గుర్తించారు.
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!