AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
- మొగుడిపై కోపం
- రాజస్తాన్లోని అజ్మీర్లో ఈ ఖతర్నాక్ వైఫ్ బాగోతం
- అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకుంది మొదటి భార్య. కొడుకు, కూతురుతో కలిసి ఘాతుకానికి పాల్పడింది. పైగా ఆ సామూహిక హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగలేదు.. ఆ మాజీ ఇల్లాలు.. భర్త పోయాడని తెలిసి గుండెలు బాదుకుంటూ డ్రామా రక్తి కట్టించింది. కానీ పోలీసులు దర్యాప్తులో అమ్మగారి బాగోతం అంతా వెలుగు చూసింది. ఆమె కపట నాటకాన్ని బయట పెట్టిన పోలీసులు.. కటకటాల్లోకి నెట్టారు. రాజస్తాన్లోని అజ్మీర్లో ఈ ఖతర్నాక్ వైఫ్ బాగోతం వెలుగు చూసింది.
రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలోని హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. తొలుత పోలీసులు.. స్థానికుల తరహాలోనే దీన్ని ఓ ప్రమాదంగానే భావించారు. కానీ వారి దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ కారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పొలాల్లో కత్తి గాట్లతో మరో మృతదేహం పడి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి, ఆయన రెండో భార్య, మేనకోడలుగా గుర్తించారు. ఐతే పోలీసుల దర్యాప్తు క్రమంలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
రామ్ సింగ్, సునీతకు 2005లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే సునీతకు ఇష్టం లేకుండా రామ్సింగ్.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై వీరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. హత్య జరిగే కంటే ఒక రోజు ముందు కూడా వీరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో కుమార్తె సరిత, మైనర్ కుమారుడితో కలిసి రామ్సింగ్ను హత్య చేసేందుకు సునీత ప్లాన్ చేసింది.
తన ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని భావించిన సునీత.. ఇందుకోసం ఆన్లైన్లో ముందుగానే కత్తిని కూడా కొనుగోలు చేసింది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న రామ్సింగ్పై కొడుకు, కూతురి సాయంతో దాడి చేసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మిగిలిన వారిని కూడా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. దర్యాప్తు క్రమంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు సునీత, ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుడిని అరెస్టు చేశారు.
పోలీసుల మందు డ్రామా రక్తి కట్టించింది
ఈ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించింది సునీత. తనకు ఏమీ తెలియదనట్లు చెప్పుకొచ్చింది. పైగా భర్త చనిపోయాడని ఎక్కడలేని బాధతో గుండెలు బాదుకుంటూ రోదించింది. పోలీసుల మందు డ్రామా రక్తి కట్టించింది. పాపం ఆ పోలీసులు కూడా నిజమోనని నమ్మారు. సీన్ కట్ చేస్తే..పలు సాంకేతిక ఆధారాల ద్వారా హత్య చేసింది ఆమేనని దర్యాప్తులో గుర్తించారు.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!