Shocking News: ఆస్తి కోసం దారుణం.. మహిళకు బలవంతంగా మద్యం తాగించి, హత్య..
- ఆస్తి కోసం దారుణం..
- ఆస్తి పత్రాలు ఇస్తానని హత్య చేసిన డీలర్..
- మద్యం తాగించి, గొంతు నులిమి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking News: ఉత్తర్ ప్రదేశ్లో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని ఎటావాలో ఆస్తి వివాదంలో, డీలర్ అతడి భాగస్వామి కలిసి ఆమెను హత్య చేశారు. నిందితులు శివేంద్ర యాదవ్(26), అతడి సహాయకుడు గౌరవ్(19)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన బాధితురాలని 25 ఏళ్ల అంజలిగా గుర్తించారు.
నిందితులు ముందుగా అంజలికి ఆస్తి పత్రాలు ఇస్తామని ఫోన్ చేశారు. ఆ తర్వాత వారు ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, గొంతు నులిమి చంపి, దహనం చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని యమునా నదిలో పారేశారు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన అంజలి మృతదేహం దారుణమైన స్థితిలో లభించింది. అంజలి మృతదేహాన్ని చూపించడానికి నిందితుడు తన తండ్రి, భార్యకు వీడియో కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
Read Also: Bengal Waqf Violence: వక్ఫ్ ముసుగులో హింస.. సొంత ప్రాంతం నుంచి హిందువులు పారిపోతున్నారు..
అంజలి కుటుంబ సభ్యులు ఆమె కాలిపోయిన స్కూటర్ని డ్రెయిన్ దగ్గర కనుగొన్నారు. ఆ తర్వాత స్థిరాస్తి డీలర్ హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు భూమి కోసం అంజలి నుంచి రూ. 6 లక్షలు తీసుకున్నాడని ఆమె సోదరి కిరణ్ చెప్పింది. ఆ తర్వాత పత్రాలు ఇచ్చే నెపంతో అతను అంజలిని చంపేశాడని పేర్కొంది. యాదవ్, అతడి భాగస్వామి విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
భర్త చనిపోయిన అంజలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భూమి కోసం రూ. 6 లక్షలు చెల్లించినప్పటికీ, డీలర్ శివేంద్ర రిజిస్ట్రేషన్ చేయించడంలో ఆలస్యం చేస్తూనే వస్తున్నాడు. నిరాశ చెందిన అంజలి తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 07, 2025న డబ్బులు ఇచ్చే నెపంతో హత్య చేశారు. రెండు నెలలుగా ప్లాట్ ఇవ్వడానికి నిందితుడు ఆలస్యం చేస్తున్నట్లు అంజలి సోదరి కిరణ్ చెప్పింది.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!