Teacher Killed: వీడిన మిస్టరీ.. తమ్ముడితో కలిసి భార్య ఆ పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి తమీమ్, ఆర్పియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వీరి సంసార జీవితంలోకి మహబూబ్ బాషా అనే వ్యక్తి వచ్చాడు. అతనితో హసీనా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన హేసేన్.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. గ్రామ పెద్దలు మహబూబ్ బాషాను మందలించి, గ్రామం నుంచి హుసేనాపురం పంపించారు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
అయినా.. హసీనా, మహబూబ్బాషాల తీరు మారలేదు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన హుసేన్.. భార్యను వేధించాడు. దీంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని హసీనా నిర్ణయించుకుంది. తన తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్బాషాతో కలసి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల్ని తన తల్లి ఇంటికి పంపించింది. గత నెల 13వ తేదీన హుసేన్ ఇస్తమాకు వెళ్లి, రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటిపైన ఇద్రూస్, మహబూబ్ బాషా ఉన్నారు. హుసేన్ నిద్రలోకి జారుకోగా.. ముగ్గురు కలిసి అతని గొంతునొక్కి చంపేశారు.
ఆ తర్వాత అనుమానం రాకుండా హుసేన్ ఆస్తమాతో ఊపిరాడక చనిపోయాడని హసీనా సమాచారం ఇచ్చింది. వైద్యులు కూడా అతడు ఊపిరాడక పోవడం వల్లే చనిపోయాడని ధృవీకరించారు. అయితే.. తన అన్నకు ఆస్తమా ఉన్నా, మందులు సక్రమంగా వాడుతున్నాడని, ఆ సమస్యతో అతను చనిపోలేదని, ఇతర కారణాలున్నాయన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక మేరకు దర్యాప్తు చేయగా, తమ్ముడు & ప్రియుడతో కలిసి భార్యే హుసేన్ను చంపినట్టు తేల్చారు.

తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?