వరంగల్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా చేసే పరికరం స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు ఒక హుక్కా కూజాతో పాటు దానికి వినియోగించే సామగ్రి మరియు ఆరు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు వివరాలను పోలీసులు వివరించారు. నిందితుల్లో శివ్వా రోహన్, వయస్సు 24, బి.టెక్ చదువుతున్నాడు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
పెంచికల కాశీరావు, మాదాపూర్, సైబరాబాద్ కి చెందిన వారుతో పాటు మత్తు పదార్థాలను సేవిస్తూ మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేయగా మరో యువకుడు పరారీలో వున్నాడు.ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంయుక్తం కల్సి హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ఓలాడ్జిపై దాడులు నిర్వహించామన్నారు.
ఈ దాడుల్లో మత్తు పదార్థాలు సేవిస్తున్న ఆరుగురు యువకులను అదుపులో తీసుకోని విచారించగా, పోలీసులు అరెస్టు చేసిన యువకులందరు స్నేహితులు. వీరందరు చదువుకునే సమయంలో మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. గత మూడేళ్ళుగా వీరందరు మత్తు మదార్థాలను వినియోగిస్తున్నారు.
ఇందులో శివ్వా రోహన్ తరుచుగా గోవాకు వెళ్ళి నైజీరియా దేశానికి చెందిన జాక్ మరియు కాల్ జాఫర్లతో వున్న పరిచయంతో వారి వద్ద నుండి కొకైన్, చరస్ మరియు ఇతర రకాల మత్తు పదార్థాలను కొనుగోలు చేసేవాడు. ఆ మత్తుపదార్థాలను రోహన్ తన స్నేహితులు అమ్మడంతో పాటు వారితో పాటు స్థానికంగా వున్న లాడ్లో మత్తు పదార్థాలను సేవించేవాడు. ఈ క్రమంలోనే మరో నిందితుడు పెంచికల కాశీరావుతో రోహన్ కి పరిచయంకావడంతో కాశీరావు సైతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూండేవాడు.
తరచూ గోవాకు వెళ్ళి నైజీరియాకు చెందిన మరో వ్యక్తి వద్ద మత్తు పదార్థాలను కొనుగోలు చేసి రోహన్ తో పాటు ఇతర యువకులకు అమ్మేవాడని. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారన్నారు.
తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోకైన్ లాంటి మత్తు పదార్థంతో పాటు ఇతర రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్, ఎస్.ఐ సాంబమూర్తి, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు మహేందర్, సృజన్, శ్రీనివాస్, శ్రీకాంత్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.
తాజావార్తలు
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?