Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలో రౌడీషీటర్లు హల్చల్ చేశారు. కృష్ణలంక రౌడీషీటర్ పండు అలియాస్ పావురం అంతిమయాత్రను సిటీలో ఓ రేంజ్లో నిర్వహించారు. అంతే కాదు.. వందల కొద్ది మంది రౌడీషీటర్లు రోడ్ల మీదకు వచ్చి ర్యాలీ చేయడం.. సిటీలో అలజడి రేపింది. దీంతో ఈ ఊరేగింపును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇందులో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. విజయవాడ రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతూ యాక్సిడెంట్లో మృతి చెందాడు. ఐతే అతని అంత్యక్రియలను తోటి రౌడీషీటర్లు అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి భవానీపురం పొలం వరకు ర్యాలీగా అంతిమయాత్ర జరిగింది. ఇందులో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతే కాదు సింగ్ నగర్ ఎల్బీఎస్ నగర్కు చెందిన బల్జిద్, పటేల్ నగర్కు చెందిన బాజీ, జక్కంపూడికి చెందిన శంకర్తో పాటు బ్లేడ్ బ్యాచ్లో కీలకంగా వ్యవహరించే శివయ్య అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్లేడ్ బ్యాచ్ సస్పెక్ట్ షీటర్లు పాల్గొన్నారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు.
READ MORE: Ragi Halwa Recipe: నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ,హెల్తీ బెల్లం రాగి హల్వా..
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
ఈ వీడియోలు వైరల్గా మారటంతో పోలీసులు మొత్తం వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. పావురం మృతికి సంబంధించి నిర్వహించిన ర్యాలీ ఘటనపై విచారణ చేపట్టారు. అంతమయాత్ర నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా కొందరిని అరెస్ట్ చేసి DJ వాహనాన్ని, 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. అదేవిధంగా స్థానికుల ఫిర్యాదు మేరకు కృష్ణలంకకు చెందిన నవీన్ సాయి సూర్య కోడి మరికొందరిపై కేసు నమోదు చేశారు. పలువురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి అందులో పాల్గొన్న వారు రౌడీషీటర్లు ఉంటే వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు..
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!