Shocking Incident: భార్య, కుమార్తె, ఇద్దరు కుమారుల హత్య.. భర్త ఆత్మహత్య..
- ఉత్తర ప్రదేశ్ వారణాసిలో దారుణం..
- భార్య పిల్లల్ని హత్య చేసి.. భర్త ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో దారుణం జరిగింది. 45 ఏళ్ల మహిళ, 25,17,15 ఏళ్ల వయసు ఉన్న ఆమె ముగ్గురు పిల్లలు కాల్చి చంపబడ్డారు. భర్త కనిపించకుండా పోవడంతో ఈ హత్యలో అతడి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో, ఒక నిర్మాణ స్థలంలో అతను కూడా మరణించి కనిపించాడు. అతడికి కూడా బుల్లెట్ గాయమైంది. నలుగురిని తుపాకీతో కాల్చి చంపి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వారణాసిలోని భదాయిని ప్రాంతంలో రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర గుప్తా నివాసం ఉంటున్న ప్రాంతంలో అతడికి చెందిన ఇంట్లోనే 20 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అయితే, ఇరుగుపొరుగు వారు రాజేంద్ర గుప్తా ఇళ్లు ఉదయం వరకు మూసేసి ఉండటంతో అనుమానించి చూడగా.. అతని భార్య తీరూన (45), నవనీంద్ర (25), గౌరాంగి (16), శుభేంద్ర గుప్తా (15) మృతదేహాలను గుర్తించారు. రాజేంద్ర కనిపించకండా పోయాడు. కొన్ని గంటల తర్వాత అతను కూడా చనిపోయి కనిపించాడు. కుటుంబాన్ని హత్య చేసి, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
Read Also: Gas Cylinder Blast: అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి బూడిదైన 6 గుడిసెలు
కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. రాజేంద్ర గుప్తా గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. శరీరాలు ఉన్న స్థితిని చూస్తే, వారు నిద్రలో ఉన్న సమయంలోనే కాల్చి చంపినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆస్తి తగాదాలు నేరానికి దారి తీసి ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర గుప్తాకు చాలా ఆస్తులు ఉన్నాయి. 8-10 ఇళ్ల ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల అద్దెల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
రాజేంద్ర గుప్తా గతంలో పలు హత్య కేసులను ఎదుర్కొని బెయిల్పై బయటకు వచ్చారని పోలీసులు తెలిపారు. అతని తండ్రి, సోదరుడు, సోదరిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం హత్యకు గురైన నీతూ గుప్తా ఆయనకు రెండో భార్య. వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని తెలిసింది. గుప్తా ఒక ఏడాది పాటు వేరే చోట ఉండీ, దీపావళికి ఇంటికి వచ్చారని తెలిసింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!