Crime: డబ్బు కోసం స్నేహితులతో భార్యపై అత్యాచారం.. మూడేళ్లుగా నరకం..
- ఉత్తర్ ప్రదేశ్ బులంద్షహర్లో దారుణం..
- డబ్బుల కోసం భార్యపై స్నేహితులతో అత్యాచారం..
- మూడేళ్లుగా సాగుతున్న అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్షహర్లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది.
Read Also: Telangana: “భూభారతి”కి గవర్నర్ ఆమోదం.. వీలైనంత త్వరగా అమలులోకి
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
తనపై అత్యాచారానికి అనుమతించడం ద్వారా ఇద్దరు స్నేహితుల నుంచి భర్త డబ్బులు తీసుకున్నాడని 35 ఏళ్ల మహిళ ఆరోపించింది. తన బాధను చెప్పుకుంటే, ఎవరితో చెప్పవద్దని కోరినట్లు ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు లైంగిక చర్యల్ని రికార్డ్ చేసేవారని, తన భర్త సౌదీ అరేబియాలో వీడియోలు చూసేవాడని తెలిపింది.
నివేదిక ప్రకారం.. సదరు మహిళకు 2010లో బులంద్షహర్ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ మెకానిక్గా పనిచేస్తున్న ఆమె భర్త ఏడాదికి రెండుసార్లు సొంతూరుకి వస్తాడు. మూడేళ్ల క్రితం భర్త ఇంటికి వచ్చినప్పుడు తన ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని తెలిసింది. భర్త సౌదీకి వెళ్లిన తర్వాత కూడా ఈ అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లల కోసం ఇదంతా మౌనంగా భరించినట్లు చెప్పింది, ఎవరితో అయినా చెబితే విడాకులు ఇస్తానని బెదిరించేవాడని వెల్లడించింది. ఇటీవల బంధువుల్లో ఒకరు ఆమె ఇంటికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబం అండగా నిలవడంతో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు నిందితుల అరెస్ట్ జరగలేదని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిసింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!