POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- మైనర్పై లైంగిక దాడి ఆరోపణలతో కేసు నమోదు
- ఫొటోలు వైరల్ చేస్తామని బెదిరింపులు
- భార్య, బంధువు సహకారం వెలుగులోకి
- నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCSO Case : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణమైన లైంగిక దాడి ఉదంతం కలకలం రేపుతోంది. బాలికను బెదిరించి, బ్లాక్మెయిల్ చేస్తూ ఘోరానికి పాల్పడిన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ (GST) శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తితో పాటు, ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన అతని భార్య, రైల్వే కోడూరు డిప్యూటీ తహసిల్దార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తూర్పు (ఈస్ట్) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు రామ్మూర్తి సదరు మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టాడు. అంతేకాకుండా, నోరు విప్పితే బాలిక తల్లిదండ్రులను సైతం చంపేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించి బ్లాక్మెయిల్కు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాదులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడ తొలుత ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేశారు. ఘటన తిరుపతిలో జరగడంతో ఆ కేసును జగద్గిరిగుట్ట పోలీసులు తిరుపతి పోలీసులకు బదిలీ చేశారు.
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
కేసును స్వీకరించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు నిందితుడు రామ్మూర్తిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో నిందితుడైన రామ్మూర్తిని కేసు నుంచి తప్పించేందుకు, బాధితురాలిని లొంగదీసుకునేందుకు అతని భార్య (డిప్యూటీ తహసిల్దార్) తో పాటు, బాలికకు వరుసకు పిన్ని అయిన మానస అనే మహిళ కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు రామ్మూర్తితో పాటు సహకరించిన పిన్ని మానసను కూడా అరెస్ట్ చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ అధికారిణి అయిన భార్య పాత్రపై విచారణ జరుపుతున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రైమ్కు సహకరించినందుకు ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ కేసు వివరాలను తిరుపతి డీఎస్పీ భక్తవత్సలము మీడియాకు వెల్లడించారు. మైనర్ పిల్లలపై ఇలాంటి వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు భయపడి దాచిపెట్టవద్దని ఆయన తల్లిదండ్రులకు, బాధితులకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఇటువంటి కీచకులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే బాధితుల వివరాలను, వారి గోప్యతను (Privacy) పూర్తిగా కాపాడుతామని, బాధితులకు న్యాయం జరిగేలా శరవేగంగా దర్యాప్తు పూర్తి చేస్తామని డీఎస్పీ భక్తవత్సలము హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!