Double Murder: ఆస్తి కోసం తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపిన కొడుకు..
- ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన కొడుకు
- సుత్తితో కొట్టి చంపిన క్రూరుడు
- యూపీలోని మోహన్లాల్గంజ్లో ఘటన
- నిందితుడికి పోలీసులు గాలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఆస్తి వివాదం కారణంగానే నిందితుడు ఈ డబుల్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని మోహన్లాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జబరులి గ్రామంలో జగదీష్ వర్మ (70), అతని భార్య శివప్యారి (68) నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు బ్రిష్కిత్ అలియాస్ లాలా.. చిన్న కొడుకు దేవదత్. జగదీష్ వర్మ వృత్తిరీత్యా కమ్మరి. చాలా రోజులుగా ఆయన పెద్ద కొడుకు బ్రిష్కిత్తో ఆస్తి విషయంలో వివాదం నడుస్తుందని.. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
Read Also: Sai Pallavi: మా అమ్మ చీర కట్టుకునే రోజు కోసం వేటింగ్ : సాయి పల్లవి
కాగా.. శనివారం రాత్రి జగదీష్, శివప్యారి తమ పెద్ద కొడుకు లాలాతో గొడవ పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొడుకు సుత్తితో వారిపై దాడికి దిగాడు. దీంతో.. తల్లిదండ్రులు తమను కొట్టొదని ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఈ సంఘటనలో తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులను మోహన్లాల్గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)లో చేర్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. దీంతో.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. మరోవైపు.. నిందితుడి కోసం గాలింపు బృందాలను మోహరించినట్లు మోహన్లాల్గంజ్ ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!