Ranga Reddy Crime News: అల్లుడి కిరాతకం.. భార్యని ఇంటికి పంపించట్లేదని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son In Law Killed His Uncle For Not Sending His Wife To Home: తన భార్యను ఇంటికి పంపించేందుకు నిరాకరిస్తున్నారని.. ఓ అల్లుడు తన మామను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తన స్నేహితుల సహకారంతో.. ఒంటరిగా వెళ్తున్న మామపై కత్తులతో దాడి చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. అయితే.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత అతడ్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్లో రమేష్ (37) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. రమేష్కు మహాలక్ష్మి అనే కుమార్తె ఉంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ నాసిర్ అహ్మద్ (31) అనే యువకుడు.. రమేష్ కుమార్తెను కిడ్నాప్ చేసి, ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Ambati Rayudu: ఐపీఎల్కి గుడ్ బై చెప్పిన రాయుడు.. ఇక నో యూటర్న్
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
తండ్రి రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు అహ్మద్పై కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చిన అహ్మద్.. తాను చేసిన పాపానికి గాను తనకు శిక్ష పడుతుందని భయపడి, మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు చర్చిగాగిల్లాపూర్లోని సర్వే నెంబరు 214లో కాపురం పెట్టారు. మొదటి రెండు నెలలు వీరి సంసార జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత అహ్మద్ తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మహాలక్ష్మిని నిత్యం హింసించసాగాడు. అతని వేధింపులు భరించలేక.. ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. అనంతరం తన భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు అహ్మద్ తన అత్తారింటికి వెళ్లాడు. అయితే.. కూతుర్ని పంపించేందుకు రమేష్ ఒప్పుకోలేదు. తన కూతుర్ని కాపురానికి పంపించనని, ఇంట్లోనే ఉంటుందని తెగేసి చెప్పాడు. అప్పటి నుంచి అహ్మద్ తన మామ రమేష్పై కక్ష పెంచుకున్నాడు. ఆయన్ను అంతమొందించేందుకు తన స్నేహితులు కోటేశ్వరరావు (24), మహేందర్ (22)లతో కలిసి ప్లాన్ వేశాడు. మెదక్ జిల్లా నుంచి వీళ్లు నాలుగు కత్తులు కొనుగోలు చేశారు.
Margani Bharath: టీడీపీకి ఇది మహానాడు కాదు.. చివరినాడు
ప్లాన్ ప్రకారం.. 2022 డిసెంబర్ 16వ తేదీన అహ్మద్ మరోసారి రమేష్ ఇంటికి వెళ్లి, తన భార్యని పంపించాలని కోరాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాసేపయ్యాక అహ్మద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక పని నిమిత్తం రమేష్ ఇంటి నుంచి బయటకు రాగా.. ఓ నిర్మానుష్య ప్రాంతంలో అహ్మద్ తన స్నేహితులతో కలిసి ఆయనపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. మరోవైపు.. అహ్మద్, అతని స్నేహితులు పారిపోయారు. పోలీసులు ఎంత గాలించినా.. వారి జాడ కనిపించలేదు. అయితే.. అహ్మద్ ఎక్కడున్నాడో శనివారం పోలీసులు ఓ విశ్వసనీయ వర్గం నుంచి సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. అతడ్ని పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, మహేందర్లను సైతం అరెస్టు చేశారు. వీళ్లు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు పంపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!