Margani Bharath: టీడీపీకి ఇది మహానాడు కాదు.. చివరినాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharath Fires On Chandrababu Naidu Nara Lokesh: టీడీపీకి ఇది మహానాడు కాదని, రాజకీయంగా చివరినాడు కాబోతోందని వైసిపి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటం దేనికి, శత జయంతి ఉత్సవాలు జరపడం దేనికి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ వల్ల ఏపీ ప్రతిష్ట కేంద్రం వద్ద దిగజారిందని మండిపడ్డారు. తాము దండి మార్చ్ విగ్రహాలు పెడితే, అక్కడ తెలుగుదేశం జెండాలు పెట్టారన్నారు. ఎన్టీఆర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వాస్తవమా కదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ పార్టీని, బ్యాంక్ అకౌంట్స్ని లాక్కున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఎన్టీఆర్ గాడ్సేతో పోల్చారని గుర్తు చేశారు. మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారని అడిగారు. లోకేష్కు పట్టం కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Naveen Ul Haq: సారీ ట్వీట్పై నవీన్ రియాక్షన్.. రిపోర్ట్ చేయమంటూ సూచన
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాతకి వెన్నుపోటు పొడిచారని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారని, అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని మార్గాని భరత్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు గురించి ఆలోచించాలని హితవు పలికారు. టిడిపి అధికారంలోకి వస్తే, వాలంటీర్ వ్యసస్థ కొనసాగిస్తామని టీడీపీ ఎందుకు తీర్మానం చేయట్లేదని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ వ్యతిరేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 వేల ఎకరాల్లో 2500 ఎకరాల వరకు పేదలకు భూమి ఇవ్వొచ్చని, ఇంకా 1100 ఎకరాల భూమి పేదలకు ఇవ్వొచ్చని తెలిపారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. సెంటు భూమి సరిపోదంటూ పేదలను అచ్చెన్నాయుడు అవహేళన చేస్తున్నారని.. టీడీపీకి పేదల ఓట్లు వద్దా? అని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే తప్పేంటని నిలదీశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని లేఖలు రాస్తున్న రఘురామ కృష్ణరాజుకి మహిళలు బుద్ది చెప్తారని హెచ్చరించారు.
Sangareddy Case Mystery: తల్లితో ఎఫైర్.. కూతురిపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
ఇక నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారని మార్గాని భరత్ స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్ భవన నిర్మాణం ఉందన్నారు. భారత్కు పూర్వ వైభవం వచ్చేలా జరిగిన పార్లమెంట్ నిర్మణాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి 10,460 కోట్ల ఆర్ధిక లోటు నిధులు సాధించామని వెల్లడించారు. మహానాడులో జగన్కి కితాబు ఇస్తే, ఏపీ ప్రజలు స్వాగతిస్తారన్నారు. కేంద్ర జల శక్తి మంత్రిని జగన్ కలిసి.. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!