Hyderabad Crime: 8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారం.. వెలుగులోకి దారుణ విషయాలు..!
- హైదరాబాద్లో దారుణం..
- అంధ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నరేష్ అనే వ్యక్తి..
- తీవ్రరక్తస్రావంతో అస్వస్తతకు గురైన బాలిక విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం..
- మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: కీచకుల కామ దాహానికి అడ్డు లేకుండా పోతోంది. ఎక్కవ పడితే అక్కడ.. ఎవరిపై పడితే వారిపై పిచ్చికుక్కల్లా ఎగబడుతున్నారు. కామవాంఛ తీర్చుకునేందుకు.. అవతలి వ్యక్తి ఎవరనేది కూడా చూడటం లేదు. వృద్ధురాలు, పసిపిల్లలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులున్న లోకమిది. ఇలాంటి మరో దారుణ ఘటన మలక్పేట్ పరిధిలో చోటుచేసుకుంది. మలక్పేట్లోని ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్!! ఇందులో బాత్రూమ్లు కడిగేందుకు వచ్చిన ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. హాస్టల్ లో ఉన్న ఎనిమిదేళ్ల అంధ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అస్వస్థతకు గురైంది. విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు హాస్టల్ అధికారులు. బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. మీ పాపకు ఆరోగ్యం బాగోలేదని వికారాబాద్లో ఉండే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ చేరుకున్న పేరెంట్స్ తమ కూతురుతో మాట్లాడటంతో అసలు విషయం బయటపడింది.
Read Also: ఆఫ్టర్ మ్యారేజ్ ఆడవాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికేవి ఏంటో తెలుసా..?
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
దీంతో, హాస్టల్ నిర్వాహకులను నిలదీశారు బాలిక తల్లిదండ్రులు. సమాధానం చెప్పకుండా దాటవేశారు. తమ కూతురుపై అత్యాచారం జరిగిందని మలక్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. బాలిక అంధురాలు కాబట్టి.. బాలిక చెప్పిన మాటలు నమ్మలేం.. ఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించండి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు పోలీసులు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు బాలికను వికారాబాద్ తీసుకెళ్లి అక్కడి ఆస్పత్రిలో చూపించారు. ఎంతకీ రక్తస్రావం ఆగకపోవడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన నీలోఫర్ వైద్యులు.. బాలికపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు.. మలక్పేట పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. నీలోఫర్ వైద్యులుచెప్తే కానీ పోలీసుల్లో కదలిక రాలేదు. ఈనెల 16న పోక్సో కేసు నమోదు చేశారు.
Read Also: Off The Record: రూటు మారుస్తున్న జగన్.. పెద్ద స్కెచ్చే వేశారా..?
ఘటన జరిగిన 15 రోజుల తర్వాత కానీ.. కామాంధుడు నరేష్ను అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో… స్థానిక నేతలు, ఏబీవీపీ ప్రతినిధులు మలక్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఘటనపై మలక్పేట పోలీసులు విచారణ జరుపుతున్నారని దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ఓ ప్రకటన చేసి చేతులుదులుపుకున్నారు. ఇంతటి దారుణం జరిగినా ఉన్నతాధికారుల్లోనూ ఎలాంటి చలనం లేదు. తోటి విద్యార్థినికి జరిగిన అఘాయిత్యంతో హాస్టల్లో ఉండే ఇతర విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..