Sangareddy: గంజాయి మత్తులో ఖైదీల వీరంగం.. భయాందోళనలో జైలు సిబ్బంది
- గంజాయి మత్తు లభించక వీరంగం
- గాజు పెంకులు మింగుతామంటూ రభస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి దొరకక దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయం చేసి జైలు అధికారులకు చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మా నియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు.
ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల సంగా రెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు ఖైదీలు సెప్టెంబరు 15న జైలులోని గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేశారు. అనంతరం గాజు పెంకులు మింగి ఆత్మహత్యకు యత్నించా మని, కడుపులో నొప్పిగా ఉందని జైలు అధికారు లకు చెప్పారు. దీంతో జైలు అధికారులు వారిని హుటాహుటిన సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రే తీసేందుకు వచ్చిన అక్కడి వైద్యసిబ్బందిని తిడుతూ.. వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు.
Also Read
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
దీంతో జైలు అధికారులు, పోలీసుల సాయంతో ఆ ఖైదీలను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో మరింత రెచ్చిపోయిన ఆ ఖైదీలు.. పోలీసులను, వైద్యులను దూషిస్తూ వైద్యం చేయించుకోకుండా గట్టిగా కేకలు వేస్తూ వార్డులోని ఓ మంచాన్ని కూడా విరగొట్టారు. విరిగిన మంచంలోని ఓ ముక్కతో కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆపై, ఆ గాజు పెంకులతో ఒళ్లంతా గాట్లు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా గాజు పెంకు లను నోట్లో పెట్టుకుని.. ఎవరైనా దగ్గరికొస్తే ఆ ముక్కలను మింగేస్తామంటూ వైద్య సిబ్బంది, పోలీ సులను బెదిరించారు. దీంతో ఎంతో కష్టపడి వారికి ట్రట్మెంట్ చేయించారు పోలీసులు.
కానీ, వైద్యులు ఇంజెక్షన్ చేసేట ప్పుడు కూడా అటూ ఇటు ఊగి పోతూ ఎగురుతూ నర్సులపై తిరగ బడుతూ నానా రభస చేశారు. దీంతో వీరి మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించాలని ఉస్మా నియా వైద్యులు సూచించారు. దీంతో జైలు అధికారులు, పోలీ సులు ఆ ఖైదీలను ఎర్రగడ్డ ఆస్ప త్రికి తరలించారు. పరీక్షలు చేసిన అక్కడి వైద్యులు ఖైదీల మానసిక స్థితి బాగానే ఉందని, కావాలనే విపరీతంగా ప్రవర్తి ున్నారని నిర్ధారించారు. దాంతో ఖైదీలను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఎలాగోలా వారికి ఎక్స్రేలు తీశారు. దాంతో ఆ ఖైదీలు గోడ గడి యారం బ్యాటరీ, పెన్నుమూత మింగారని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. మందులు ఇవ్వ డంతో బ్యాటరీ, పెన్నుమూత బయటపడ్డాయి. అనంతరం ఆ ఖైదీలను డిశ్చార్జి చేయడంతో అటు పోలీసులు, ఇటు జైలు అధికారులు ఊపిరి పీల్చుకు న్నారు. Give English URL, SEO Meta Title, SEO Meta Description, SEO Meta Keywords in English
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!