Meerpet Murder Case: పక్కా ప్రణాళిక ప్రకారం హత్య.. సీపీ సంచలన విషయాలు
- మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
- అంతకముందు గురుమూర్తి ఇంట్లో, మీర్పేట్ పెద్ద చెరువు వద్ద సీన్ రీ-కన్స్ట్రక్షన్
- భార్య వెంకట మాధవిని కిరాతంగా హత్య చేసిన గురుమూర్తి అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో మీర్పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని అన్నారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు.. అందుకోసమే ఆమెని కొట్టాడని సీపీ వెల్లడించారు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది.. వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా, ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు.. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు.. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.. కిచెన్లో నుండి కత్తి తీసుకొని వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
Read Also: Mumbai: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్.. ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మొదట మాధవి భుజాలను కట్ చేశాడు.. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు.. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు.. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు.. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆ తర్వాత బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు.. ఆ తర్వాత శరీర భాగాలను అందులో వేసి ఉడికించాడు.. ఆ తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై ఉంచాడన్నారు. అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు.. ఆ పౌడర్ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు.. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో ఉంచాడని సీపీ వెల్లడించారు. నిందితుడు గురుమూర్తి కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచే ఇదంతా చేశాడని అన్నారు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్ గా చేశాడు.. డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Read Also: KTR: మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కేటీఆర్.. విద్యార్థులు వినతి పత్రం
ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేశామని రాచకొండ సీపీ చెప్పారు. గురుమూర్తికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని సీపీ తెలిపారు. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు.. ప్రకాశం జిల్లాకి చెందిన గురుమూర్తి.. వెంకట మాధవి జిల్లెలగూడలో ఉంటున్నారని అన్నారు. భార్యను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే భార్య మాధవి తో గొడవ పెట్టుకున్నాడు.. వెంకట మాధవిని కొట్టాడు.. గోడకు వేసి అదిమాడు.. మాధవి పైన కూర్చుని గొంతు నులిమాడు.. ఊపిరి ఆగిపోయేంత వరకు గొంతు నులిమాడని సీపీ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. మాధవిని హత్య చేసి బూడిద చేసి చెరువులో పారేసిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడని సీపీ చెప్పారు. పిల్లలకు తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు.. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు.. అత్త, మామలకు కూడా ఇదే విషయం చెప్పాడన్నారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.. ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. మాధవిని పక్కా ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడు.. క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ చెప్పారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!