Nellore M*urder: కడుపులో, గొంతుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి భార్యను హతమార్చిన భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore M*urder: భార్య ప్రవర్తనతో అతను విసిగిపోయాడు.. పద్ధతి మార్చుకోవాలంటూ పదేపదే ఆమెకు చెప్పాడు.. కానీ ఆమె వినలేదు.. దీంతో ఆమెకు దూరంగా ఉంటూ వచ్చిన భర్త.. చివరకు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కలిగించింది.
భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరులోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అయోధ్య నగర్లో జరిగింది. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంకి చెందిన నందినికి.. కోటమిట్టకు చెందిన శ్రీహరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీహరి నెల్లూరులోని ఓ ప్రైవేట్ బస్సు సర్వీస్లో సూపర్వైజర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్లపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు నెలకొన్నాయి. నందిని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
Sun Massive Explosion : సూర్యుడిపై 17 భారీ పేలుళ్లు.. భూమికి పొంచి ఉన్న డేంజర్ ఇదే.!
శ్రీహరికి, నందినికి మధ్య గొడవలు రోజు జరుగుతూ ఉండడంతో.. తొమ్మిది నెలల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. నందిని.. భర్తను, కుమార్తెను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని మధ్యలో ఆగిపోయారు. అప్పుడప్పుడు ఇద్దరూ ఫోన్ చేసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా చంపేయాలని శ్రీహరి 3 నెలల కిందట నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో మాట్లాడుతూ.. ఆమె కదలికలను గమనించేవాడు.. నందినికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె ఆక్కడికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే శ్రీహరితో తరచూ మాట్లాడుతూ ఉండేది.
రెండు రోజుల క్రితం నెల్లూరుకు వస్తున్నట్లు శ్రీహరికి ఆమె ఫోన్ చేసి చెప్పింది. పికప్ చేసుకునేందుకు చింతా రెడ్డిపాలెం నేషనల్ హైవే వద్దకు రావాలని సూచించింది. దీంతో శ్రీహరి ఆమెను అంతమొందించేందుకు తన వెంట కత్తి తీసుకువెళ్లాడు. ఆమె బస్సు దిగగానే భార్యతో మాట్లాడుకుంటూ సమీపంలోని అయోధ్య నగర్ నాలుగో వీధిలోని ఖాళీ స్థలం వద్దకు వచ్చాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. నందిని ఎదురు తిరగడంతో తన వద్దనున్న కత్తితో కడుపులో, గొంతుపై విచక్షణ రహితంగా పొడిచి ఆమెను హత్య చేసి పరారయ్యాడు.
Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
సమాచారం తెలుసుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు పోవడంతో నాలుగేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!