కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. రోజువారి కేసులు లక్షా 60 వేలను దాటేసి రెండు లక్షల వైపు పరుగులు పెడుతున్నాయి.. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని.. డెత్ రేట్ కూడా తక్కువే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, కొందరని మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది.. జ్వరం వచ్చినా.. అది కరోనా అయిఉంటుందనే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా, తమిళనాడులో కరోనా భయంతో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారిది.. మధురై ఎంజీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న జ్యోతిక అనే మహిళకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది.. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతోన్న ఆమె.. కరోనా వచ్చిందేమో అనే భయానికి గురైంది.. దీంతో విషయం తాగి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించింది.. ఈ ఘటనలో తల్లీ కొడుకు మృతిచెందగా.. మరో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు చెబుతున్నారు.