Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..
- మైనర్ బాలికపై అత్యాచారం..
- పెళ్లి పేరుతో నమ్మించి.. మరొకరిని అపహరించి అఘాయిత్యం..
- రాజస్థాన్.. మహారాష్ట్రలో ఘటనలు..
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.
బాలికతో పాటు బాలిక కుటుంబంతో నిందితుడు స్నేహం చేస్తూ నమ్మించాడు. బాలిక కుటుంబ సభ్యులు తరుచూ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ లైంగిక వేధింపులు మేలో ప్రారంభమయ్యాయి. అయితే సోమవారం ఇదే విధంగా చేయడానికి ప్రయత్నించిన సమయంలో బాలిక అందుకు అడ్డు చెప్పింది. దీంతో నిందితుడు ఆమెను కొట్టి బెదిరించినట్లు అధికారులు తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
Read Also: Andhra Pradesh: బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ.. ప్రతిపాదనలో వారి పేర్లు!
రాజస్థాన్లో 15 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్:
జోధ్పూర్లో ఇంటి నుంచి తప్పిపోయిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వెనక ఉన్న డంప్ యార్డ్లో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆదివారం రాత్రి బాలిక మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి చేరుకోగానే ఆమెపై అత్యాచారం జరిగినట్లు జోధ్పూర్ సిటీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటనపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పి్స్తున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!