Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..
- మైనర్ బాలికపై అత్యాచారం..
- పెళ్లి పేరుతో నమ్మించి.. మరొకరిని అపహరించి అఘాయిత్యం..
- రాజస్థాన్.. మహారాష్ట్రలో ఘటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.
బాలికతో పాటు బాలిక కుటుంబంతో నిందితుడు స్నేహం చేస్తూ నమ్మించాడు. బాలిక కుటుంబ సభ్యులు తరుచూ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ లైంగిక వేధింపులు మేలో ప్రారంభమయ్యాయి. అయితే సోమవారం ఇదే విధంగా చేయడానికి ప్రయత్నించిన సమయంలో బాలిక అందుకు అడ్డు చెప్పింది. దీంతో నిందితుడు ఆమెను కొట్టి బెదిరించినట్లు అధికారులు తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Read Also: Andhra Pradesh: బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ.. ప్రతిపాదనలో వారి పేర్లు!
రాజస్థాన్లో 15 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్:
జోధ్పూర్లో ఇంటి నుంచి తప్పిపోయిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వెనక ఉన్న డంప్ యార్డ్లో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆదివారం రాత్రి బాలిక మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి చేరుకోగానే ఆమెపై అత్యాచారం జరిగినట్లు జోధ్పూర్ సిటీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటనపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పి్స్తున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!