AP Crime: ఏపీలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య..!
- ఏపీలో మరో దారుణమైన ఘటన..
- తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య..
- నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఘటన..
- ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి..
- చిన్నారిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసిని మైనర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏపీలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. తొమ్మిదేళ్ల చిన్నారి.. ఆడుకుంటానని బయటకు వెళ్లింది.. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు తల్లిదండ్రులు.. కానీ, నాలుగు రోజులైంది.. జాడ తెలీలేదు. చివరికి ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేసారనే సమాచారంతో తల్లిదండ్రుల గుండెలు గుబేలుమన్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది.. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడుందోనని వెతికారు, కనిపోయించలేదు. చీకటి పడింది.. అయినా జాడ దొరకపోవడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
Read Also: Israel: “గాజా సిటీని వెంటనే ఖాళీ చేయాలి”.. భారీ దాడికి సిద్ధమైన ఇజ్రాయిల్..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ఇక, ఆ తరువాత రోజే ఎంపీ బైరెడ్డి శబరి విజయోత్సవ సభ నందికొట్కూరులో ఉండగా ఆమెకు బాలిక అదృశ్యంపై సమాచారం ఇచ్చారు. వెంటనే ఆచూకీ కనుక్కోవాలి పోలీసులను ఆదేశించింది. రెండు రోజులపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. మూడవ రోజు పోలీస్ జాగిలాలతో ముచ్చుమర్రిలో పరిశీలించారు. పోలీసు జాగిలం పార్కు వద్ద నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ముచ్చుమర్రి లిఫ్ట్ అప్రోచ్ కెనాల్ వరకు వెళ్లింది. బాలిక ఆడుకున్న పార్కులో విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టయిల్ లో విచారించారు పోలీసులు.. అందులో ఒకరు బాలిక వాసంతిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపు వారే.. ముచ్చుమర్రి కి చెందిన వారే. వారిని కాలువ వద్దకు తీసుకువెళ్లి ఎక్కడ పడేసింది చూపించమన్నారు. దర్యాప్తులో అప్పటికే చీకటి పడడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం కలిగింది. మరుసటి రోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో బాలిక మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఎంపీ బైరెడ్డి శబరి కూడా కాలువలో బోటులో వెళ్ళింది. ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎస్పీ రఘువీర్ రెడ్డి గాలింపును పర్యవేక్షించారు.
Read Also: Crime: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యపై సవతి కొడుకు అత్యాచారం..
అయితే, బాలికపై అత్యాచారం, హత్యపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అభం, శుభం ఎరుగని చిన్నారిపై ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలికపై జరిగింది దారుణమన్నారు ఎమ్మెల్యే జయసూర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారాయన. నందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలనారు. నా బిడ్డను చంపిన వాళ్ళను ఎన్ కౌంటర్ చేసి చంపాలన్నారు వాసంతి తల్లి సుజాత. తండ్రి మద్దిలేటి.. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వాసంతి నానమ్మ వాపోయింది. పనీపాటా లేకుండా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నారన్నారు అంటూ కన్నీరుమున్నీరైంది.. ఇలాంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. మేం అనుభవిస్తున్న బాధ వాళ్ల తల్లిదండ్రులు కూడా అనుభవించాలని శాపనార్థాలు పెట్టారు. రౌడీలు పెట్రరేగిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. గాంజాయి పిల్లలకు కూడా చేరుతోందన్నారాయన. బాలిక తల్లిదండ్రులను ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంపీ బైరెడ్డి శబరి. ఇక, బాలికపై అత్యాచారం, హత్యపై పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడించేందుకు ఎస్పీ రఘువీర్ రెడ్డి నిరాకరించారు. కేసు దర్యాప్తులో వుందన్నారు ఎస్పీ.
తాజావార్తలు
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!